Rajnath Singh: ‘‘వర్క్ ఫ్రం హోమ్’’ విన్నా, కానీ తొలిసారి ‘‘వర్క్ ఫ్రం జైల్’’ వింటున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ మంత్రి విమర్శలు చేశారు. ఫతేఘర్ సాహిబ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెజ్జా రామ్ వాల్మీకి కోసం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ఆప్ అధికార పార్టీ, అది ఎలాంటి పని చేస్తుందో మీకు పెద్దగా చెప్పనవసరం లేదని అన్నారు. ఢిల్లీలో కూడా ఇదే పార్టీ ప్రభుత్వం ఉందని, కానీ మద్యం కుంభకోణంలో ఒక నాయకుడు జైలు పాలయ్యాడని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడారు. ఒక వ్యక్తిపై ఏవైనా ఆరోపణలు వస్తే తన పదవికి రాజీనామా చేసే నైతిక ధైర్యం, ప్రతీ నాయకుడికి ఉండాలని తాను భావిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Read Also: Uttar Pradesh: వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం.. కత్తితో పొడిచి హత్య
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ జైలు పాలయ్యాడని, అక్కడి నుంచే ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తానని చెప్పాడని, మనందరికి వర్క్ ఫ్రం ఆఫీస్, వర్క్ ఫ్రం హోమ్ గురించి తెలుసని, కానీ తొలిసారి ‘‘వర్క్ ఫ్రండ్ జైల్’’ గురించి వింటున్నానని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అవినీతిపై అన్నాహజారేతో కలిసి కేజ్రీవాల్ ఉద్యమం చేసిన సమయంలో, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హజారే సూచించినప్పటికీ, కేజ్రీవాల్ తన గురువు మాట వినకుండా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని స్థాపించారని అన్నారు. ముఖ్యమంత్రి తన నివాసాన్ని ‘శీష్ మహల్’’గా మార్చి కోట్లాది ప్రజాధనాన్ని వినియోగించుకున్నాడని రాజ్నాథ్ ఆరోపించారు.
స్వాతి మలివాల్పై దాడి అంశం గురించి మాట్లాడుతూ..కేజ్రీవాల్ నివాసంలో మలివాల్పై దాడి చేసి, ఇప్పుడు దేశ ప్రజల ముందు ప్రసంగాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ విషయంపై కేజ్రీవాల్ 15 రోజుల పాటు మౌనంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. మీ నివాసంలో ఎంపీపై దాడి జరిగితే మౌనంగా ఉన్నాడని, అలాంటి వ్యక్తికి సీఎంగా కొనసాగే హక్కు ఉందా..? అని రాజ్నాథ్ ప్రజల్ని ప్రశ్నించారు. పంజాబ్ లోని 13 లోక్సభ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!