Congress: ‘సంవిధాన్ హత్యా దివాస్’పై కాంగ్రెస్.. 10 ఏళ్ల నుంచి బీజేపీ అదే చేస్తుందని ధ్వజం..
- ‘సంవిధాన్ హత్యా దివాస్’పై రాజకీయ రగడ..
- కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్..
- గత పదేళ్ల నుంచి మోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు..
- కాంగ్రెస్ నేతల మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అయితే, ఈ రోజును ప్రతీ ఏడాది ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలని ఈ రోజు కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతోంది. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ దీనిని ప్రకటించిందంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని మోడీ టార్గెట్గా విమర్శలు చేశారు. ‘‘నాన్-బయోలాజికల్ పీఎం ద్వారా హెడ్లైన్స్ కోసం చేయబడిని పని’’ అని అన్నారు.
Read Also: Uttar Pradesh: యువకుడితో ఇద్దరు పిల్లల తల్లి రొమాన్స్.. గదిలో పట్టుకున్న భర్త
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
కేంద్రం నిర్ణయాన్ని జైరాం రమేష్ తప్పుపట్టారు. గత పదేళ్లుగా భారతీయులపై అప్రకటిత ఎమర్జెన్సీని ప్రధాని నరేంద్రమోడీపై మండిపడ్డారు. జూన్ 4ని ‘మోడీ ముక్తి దివాస్’గా చరిత్రలో నిలిచిపోయిందని ఆయన అన్నారు. జూన్ 4, 2024న భారతదేశ ప్రజలు ప్రధాని మోడీకి నిర్ణయాత్మక వ్యక్తిగత రాజకీయ, నైతిక ఓటమిని అందించారని అన్నారు. ప్రధాని మోడీ భారత రాజ్యాంగం, దాని సూత్రాలు, విలువలపై రాజ్యాంగ సంస్థలపై క్రమబద్ధమైన దాడి చేశారని ఆరోపించారు. మనుస్మృతి నుండి ప్రేరణ పొందిన మోడీ పరివార్ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించిందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. 1949లో మనుస్మృతి నుండి ప్రేరణ పొందలేదనే కారణంతో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తిరస్కరించిందని అన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని తీసుకురావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తద్వారా దళితులు, గిరిజనులు, వెనబడిన తరగతుల వారి హక్కులపై దాడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసమే పవిత్రమైన రాజ్యాంగానికి హత్యా అనే పదాన్ని జత చేసి అంబేద్కర్ని అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
Yet another headline grabbing exercise in hypocrisy by the non-biological PM who had imposed an undeclared Emergency for ten long years before the people of India handed him a decisive personal, political, and moral defeat on June 4, 2024 – which will go down in history as…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 12, 2024
తాజావార్తలు
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!