DMK: ‘‘అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్ద పడుకోబెడుతున్నాడు’’.. డీఎంకే నేత భార్య సంచలన ఆరోపణలు..
- "నా భర్త రాజకీయ నాయకులకు అమ్మాయిలను సఫ్లై చేస్తాడు."
- తమిళనాడులో సంచలనంగా డీఎంకే నేత భార్య ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన నాయకుడి భార్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే మధ్య విమర్శలకు దారి తీసింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి, తన భర్త తనపై హింస, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. నిందితుడైన 40 ఏళ్ల వ్యక్తికి అధికార డీఎంకేతో సంబంధాలు ఉన్నాయి. ‘‘అతని పని 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్ద పడుకోబెట్టడం, అతను నన్ను పిచ్చి కుక్కలా కొరుకుతాడు’’ అంటూ ఆరోపణలు చేసింది.
అరక్కోణం జిల్లాకు చెందిన 20 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని అయిన సదరు మహిళ, తన భర్త దేవసేయల్పై ఆరోపణలు చేసింది. తన భర్త డీఎంకే యువజన విభాగం డిప్యూటీ సెక్రటరీగా చెప్పుకుంటూ, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుటుంబ సభ్యుల్ని కాల్చి వేస్తానని బెదిరించినట్లు చెప్పింది. ‘‘కాలేజ్కి వెళ్లే దారిలో నాపై దాడి చేసి, ఫోన్ పగలగొట్టాడు, నువ్వు ఫిర్యాదు చేసిన పోలీసులు నాకే సాయం చేస్తారు’’ అని చెప్పినట్లు బాధిత మహిళ ఆరోపించింది.
Also Read
Read Also: Looting bride: 25 మందిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ.. దోచుకుని పారిపోవడం ఇమె స్టైల్..
‘‘20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకులతో పడుకోబెట్టడం అతని పని… అతనిపై ఎప్పుడూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేను ఫిర్యాదు చేసినప్పుటి నుంచి అతను నన్ను ముక్కలుగా నరికివేస్తానని బెదిరించాడు. అతను నన్ను కారులో హింసించాడు,అతను చూపించిన వ్యక్తులతో పడుకోమని చెప్పాడు… నేను నా ఇంటికే పరిమితమయ్యాను, నేను నా పరీక్షలు కూడా రాయలేకపోయాను’’అని మహిళ చెప్పింది. తన భర్త అందరి ముందు వేధిస్తున్నాడని, డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ చర్యలు తీసుకోవాలని కోరింది. చర్యలు తీసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించింది.
అయితే, ఈ వ్యవహారం రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఆరోపణలకు కారణమైంది. నిందితుడైన దేవసేయల్ని డీఎంకే కాపాడుతోందని అన్నాడీఎకేం ఆరోపించింది. అధికార పార్టీలో ఉన్న సంబంధాల కారణంగా పోలీసులు మొదట కేసు నమోదు చేయలేదని, స్థానిక అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎస్ రవి కలుగచేసుకోవడంతో పోలీసులు మహిళ ఫిర్యాదును తీసుకున్నారని అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి అన్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తన భర్తకు తమిళనాడు స్కూల్ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్బిల్ మహేష్ పొయ్యమోళితో సంబంధాలు ఉన్నాయని మహిళ పేర్కొంది.
ప్రాథమిక విచారణలో లైంగిక వేధింపులకు కారణమని సూచించే ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. అధికార డీఎంకే పార్టీ ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. దోషులపై చర్యలు తీసుకుంటామని, పోలీసుల దర్యాప్తును బట్టి పార్టీ అంతర్గత చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!