Looting bride: 25 మందిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ.. దోచుకుని పారిపోవడం ఇమె స్టైల్..
- 25 మందిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ..
- పెళ్లి చేసుకుని విలువైన ఆభరణాలతో పారిపోవడం ఈమె స్టైల్..
- ఎట్టకేలకు రాజస్థాన్ పోలీసులకు చిక్కిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Looting bride: వరసగా పెళ్లిళ్లు చేసుకుంటూ, యువకుల్ని మోసం చేస్తున్న ఓ కిలాడీ లేడీ పట్టుబడింది. ఇప్పటివరకు ఈమె మొత్తం 25 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. అనురాధ పాశ్వాన్(32) అనే మహిళ నిత్య పెళ్లికూతురుగా మారింది. పెళ్లిళ్లు చేసుకుంటూ, వరుల వద్ద నుంచి విలువైన ఆభరణాలు, నగదు దొంగలించి ఉడాయించడం ఈమె స్టైల్. మొత్తం 25 మంది పురుషులను వివాహాలు చేసుకుని మోసగించినట్లు తేలింది. ఒక పెళ్లి చేసుకున్న తర్వాత, మరో పెళ్లి సమయానికి ఆమె తన పేరును, ఐడెంటిటీని మార్చుకుంటుంది.
Read Also: Jyoti Malhotra: “భారత్ ఏజెంట్ల”ను గుర్తించేందుకు పాకిస్తాన్కి సాయం చేసిన జ్యోతి మల్హోత్రా.!
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
అయితే, రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ పోలీసులు అనురాధ పాశ్వాన్ని పట్టుకునేందుకు ఆమె స్టైల్లోనే ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ముందుగా, ‘‘తమది పేద కుటుంబం అని, తనకు నిరుద్యోగ సోదరుడు ఉన్నాడని, తాను వివాహానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు’’ అని నటిస్తుంది. ఈ మొత్తం మోసంలో ఈమెకు పెద్ద ముఠానే ఉంది. ఈ ముఠానే ముందుగా వరుడు వద్దకు అనురాధ ఫోటోలను తీసుకుని వెళ్తారు. ఈ ముఠాలో బ్రోకర్గా నటించే వ్యక్తి, పెళ్లి సెట్ చేయడానికి రూ. 2 లక్షలు వసూలు చేస్తాడు, ఆ తర్వాత నుంచి అనురాధ నటనతో పెళ్లికొడుకు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందుతుంది. ఆ తర్వాత ఆ కుటుంబంలోని ప్రతీ వ్యక్తితో పరిచయాన్ని పెంచుకుంటుంది.
కొన్ని రోజుల తర్వాత ఆమె తన ప్రణాళికలో భాగంగా ఆహారంలో మత్తు మందు కలిపి, ఆ ఇంటి నుంచి నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులతో పారిపోతుంది. 25 మంది బాధితుల్లో ఒకరైన విష్ణు శర్మ కూడా ఒకరు. ఏప్రిల్ 20న, సవాయి మాధోపూర్ నివాసి విష్ణు శర్మ, మధ్యప్రదేశ్కు చెందిన అనురాధ పాశ్వాన్ను వివాహం చేసుకున్నాడు. బ్రోకర్ పప్పూ మీనాకు రూ. 2 లక్షలు చెల్లించాడు. వివాహం చేసుకున్న రెండు వారాల్లోనే అనురాధ రూ. 1.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 30,000 నగదు, విలువైన సెల్ఫోన్తో పారిపోయింది. పోలీసులకు విష్ణు శర్మ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సవాయ్ మాధోపూర్ పోలీసులు, ఒక కానిస్టేబుల్కి వరుడిగా నటింపచేసి, అనురాధను పట్టుకున్నారు. భోపాల్లో ఆమెను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!