BJP: “కోల్కతా ఢాకాలా మారిందా..?” కాషాయ జెండా తొలగించడంపై బీజేపీ ఫైర్..
- బస్సును చుట్టుముటి కాషాయ జెండా తొలగించాలని ఒత్తిడి..
- కోల్కతా ఘటనపై బీజేపీ ఆగ్రహం..
- మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపుకు పాల్పడుతుందని విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గుంపు హింసకు పాల్పడుతోంది. ఇటీవల ముర్షిదాబాద్, మాల్దాలో ఇలాంటి ఘటనలే జరిగాయి, రాళ్లదాడితో పాటు వాహనాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో అల్లర్లను సీఎం మమతా బెనర్జీ కంట్రోల్ చేయలేకపోతున్నారని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది.
ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి కూడా మండిపడ్డారు. “స్వామి వివేకానంద జన్మస్థలం కోల్కతా నుండి షాకింగ్ దృశ్యాలు! ధైర్యం, త్యాగం మరియు శౌర్యానికి చిహ్నంగా ఉన్న కాషాయ జెండాను కొంతమంది రాడికల్స్ గుంపు బస్సు నుండి బలవంతంగా తొలగించింది” అని అన్నారు. మమతా బెనర్జీ ముస్లింలను హిందువులపైకి రెచ్చగొట్టి బెంగాల్ని బంగ్లాదేశ్గా మార్చడానికి చూస్తున్నారని బీజేపీ ఎంపీ ఖర్గెన్ ముర్ము ఆరోపించారు.
Also Read
- Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
Read Also: Moto Book 60 Laptop: 14-అంగుళాల డిస్ప్లే, ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్తో విడుదలకు సిద్దమైన మోటో బుక్ 60
ఇదిలా ఉంటే, ఇప్పుడు కోల్కతాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఓ బస్సుకు కట్టి ఉంచిన ‘‘ కాషాయ జెండా’’ ని తొలగించాలని, బస్సు డ్రైవర్ని చుట్టుముట్టిన వీడియో వైరల్ అయింది. దీనిని బీజేపీ షేర్ చేసి, ఉత్తర కోల్కతాలోని స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి ముందు ఈ సంఘటన జరిగిందని బీజేపీ పేర్కొంది. కోల్కతా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాగా మారిందా..? అని ప్రశ్నించింది.
దీనికి సంబంధించిన వీడియోని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ షేర్ చేశారు. పోలీసులు నిశ్శబ్ద ప్రేక్షకులుగా మారిపోయారని ఆరోపించారు. ఒక ఉన్మాద గుంపు హిందూ బస్సు డ్రైవర్ని చుట్టుముట్టి బలవంతంగా కాషాయ జెండాను తొలగించాలని భయబ్రాంతులకు గురిచేసిందని అన్నారు. అతడిని భయపెట్టి, అవమానించారని ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘‘మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో లౌకికవాదం ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు భయం, బుజ్జగింపుతో కుళ్లిపోయిన రాష్ట్రం’’ అని అన్నారు. ఇది హిందూ విశ్వాసంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు.
Shocking scenes from Swami Vivekananda's birthplace, Kolkata!
A Saffron flag, a symbol of courage, sacrifice and valor, got forcefully removed from a bus by a mob of radicals.
Is this the harmony and tolerance Swamiji stood for? Under Mamata Banerjee's watch, such acts go… pic.twitter.com/is3SOgV6jJ— Suvendu Adhikari (@SuvenduWB) April 10, 2025
తాజావార్తలు
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?