టార్గెట్ ఒవైసీ… పోలీసుల అదుపులో నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని దుండగులు టార్గెట్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఒవైసీ.. ముఖ్యంగా యూపీలోకి కేంద్రీకరించి అభ్యర్థులను బరిలోకి దింపారు.. ఇదే సమయంలో ఒవైసీని టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన.. తన కారుకు దిగిన బుల్లెట్లకు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు.
Read Also: బ్రేకింగ్: అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు
Also Read
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మీరట్ పట్టణంలోని కిథౌర్లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు ఒవైసీ.. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసదుద్దీన్ వాహనంపై దుండగులు 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒవైసీ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరో వాహనంలో ఢిల్లీకి చేరుకున్నారు.. ముగ్గురు, నలుగురు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపారని.. మూడు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని.. అనంతరం అక్కడి నుంచి పారిపోయారని వెల్లడించారు.. అయితే, ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.. ఇక, ఆ తర్వాత.. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు మరియు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నాకు సమాచారం ఇచ్చారని కూడా తెలిపారు ఒవైసీ.. ఇక, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన హాపూర్ ఎస్పీ దీపక్.. కాల్పుల ఘటనలో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు.. అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని.. అతని సహచరుడు పారిపోయాడని వెల్లడించారు.. పారిపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టాం.. ఈ ఘటనలో మరిన్ని వాస్తవాలు తెరపైకి వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తామని.. ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కాలేదు.. కాల్పులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా తనిఖీ చేస్తున్నామని తెలిపారు దీపక్ భుకర్.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!