RBI Interest Rates: హ్యాపీగా ఇంటి రుణాలు తీసుకోవచ్చు.. వడ్డీరేట్లు పెరగవట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Interest Rates: ఇంటి రుణాలతోపాటు.. ఇతరత్రా రుణాలు తీసుకునే వారికి రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో.. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. ఆగస్టులో జరిగే సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆగస్టు 8 నుంచి 10 తేదీల్లో ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also: Suriya: వీరుడొచ్చే వేలయ్యింది… కంగువా ఆగమనం
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
బుధవారం జరిగిన భారతీయ పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) సమావేశంలో దినేశ్ మాట్లాడారు. వడ్డీ రేట్లను సవరించేందుకు ఆర్బీఐ ఎన్నో అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుందని, ఇందులో ద్రవ్యోల్బణం ముఖ్యమని పేర్కొన్నారు. ఒక బ్యాంకుగా వడ్డీ రేట్లు తగ్గుతాయని అనుకోవడం లేదని.. కానీ స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. జూన్ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును మార్చకుండా 6.5 శాతంగా ఉంచిన సంగతి విదితమే. రిటైల్కు గిరాకీ పెరుగుతున్నందున, విస్తరణ కోసం సంస్థలు మూలధన పెట్టుబడి పెడుతున్నాయని చెప్పారు. వినియోగం పెరుగుతున్నందుకు, సామర్థ్య విస్తరణకు కార్పొరేట్ సంస్థలూ పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు మూలధన పెట్టుబడులు సరైన మార్గంలోనే వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సేవల రంగంలో కొత్తతరం ఫిన్టెక్ సంస్థలు కీలకంగా మారాయని దినేశ్ ఖారా పేర్కొన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్చైన్, డేటా అనలిటిక్స్ లాంటి సాంకేతికతలను వినియోగిస్తూ, ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గడిచిన కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నదని కాబట్టి ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే ఆర్బీఐ కొనసాగించవచ్చన్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!