RBI Interest Rates: హ్యాపీగా ఇంటి రుణాలు తీసుకోవచ్చు.. వడ్డీరేట్లు పెరగవట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Interest Rates: ఇంటి రుణాలతోపాటు.. ఇతరత్రా రుణాలు తీసుకునే వారికి రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో.. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. ఆగస్టులో జరిగే సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆగస్టు 8 నుంచి 10 తేదీల్లో ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎస్బీఐ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also: Suriya: వీరుడొచ్చే వేలయ్యింది… కంగువా ఆగమనం
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
బుధవారం జరిగిన భారతీయ పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) సమావేశంలో దినేశ్ మాట్లాడారు. వడ్డీ రేట్లను సవరించేందుకు ఆర్బీఐ ఎన్నో అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుందని, ఇందులో ద్రవ్యోల్బణం ముఖ్యమని పేర్కొన్నారు. ఒక బ్యాంకుగా వడ్డీ రేట్లు తగ్గుతాయని అనుకోవడం లేదని.. కానీ స్థిరంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. జూన్ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును మార్చకుండా 6.5 శాతంగా ఉంచిన సంగతి విదితమే. రిటైల్కు గిరాకీ పెరుగుతున్నందున, విస్తరణ కోసం సంస్థలు మూలధన పెట్టుబడి పెడుతున్నాయని చెప్పారు. వినియోగం పెరుగుతున్నందుకు, సామర్థ్య విస్తరణకు కార్పొరేట్ సంస్థలూ పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు మూలధన పెట్టుబడులు సరైన మార్గంలోనే వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సేవల రంగంలో కొత్తతరం ఫిన్టెక్ సంస్థలు కీలకంగా మారాయని దినేశ్ ఖారా పేర్కొన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్చైన్, డేటా అనలిటిక్స్ లాంటి సాంకేతికతలను వినియోగిస్తూ, ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గడిచిన కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నదని కాబట్టి ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను యథాతథ స్థితిలోనే ఆర్బీఐ కొనసాగించవచ్చన్నారు.
తాజావార్తలు
-
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!