Hamas: పీవోకేలో హమాస్ నాయకులు భారత వ్యతిరేక కార్యక్రమం.. ఉగ్రవాదులు భారీ ర్యాలీ
- పీవోకేలో హమాస్ నాయకులు భారత వ్యతిరేక కార్యక్రమం
- కార్లు, బైకులు, గుర్రాలతో ఘనస్వాగతం
- భారత నిఘా వర్గాలు అప్రమత్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హమాస్ నాయకులు హల్చల్ సృష్టించారు. పశ్చిమాసియాకే పరిమితమైన వారి ప్రభావం ఇప్పుడు భారత్లో కూడా విస్తరించేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
ఇది కూడా చదవండి: VinFast VF 3: నానో కంటే మరో చిన్న కారు.. ఊపు ఊపేయడానికి వస్తున్న ఈవీ
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఫిబ్రవరి 5, 2025 (బుధవారం) పాకిస్థాన్ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు.. రావలకోట్లోని షహీద్ సబీర్ స్టేడియంలో భారత వ్యతిరేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హమాస్కు చెందిన ఉగ్రవాదులు హాజరయ్యారు. హమాస్ జెండాలు పెట్టుకున్న లగ్జరీ ఎస్యూవీ కార్లు, బైకులు, గుర్రాలతో భారీ ర్యాలీగా వెళ్లి ఘనస్వాగతం పలికారు. జైషే ఉగ్రవాదులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. పూల వర్షం కూడా కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలను బట్టి చూస్తే హమాస్.. తన సామ్రాజాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: S Jaishankar: అమెరికా నుంచి భారతీయులను బహిష్కరించడంపై స్పందించిన జైశంకర్..
భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు హమాస్ తన సామ్రాజ్యా్న్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్, జైష్ కమాండర్ అస్గర్ ఖాన్ కాశ్మీరీతో సహా అగ్ర ఉగ్రవాద నాయకులంతా హాజరయ్యారు. ఇక ఇరాన్లో హమాస్ ప్రతినిధి బృందానికి నాయకుడైన ఖలీద్ అల్-ఖాదౌమి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గతంలో అనేక మంది హమాస్ నాయకులు.. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. దక్షిణాసియాలోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CRDA Letter to Election Commission: రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్..! ఈసీకి సీఆర్డీఏ లేఖ
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..