Hamas: పీవోకేలో హమాస్ నాయకులు భారత వ్యతిరేక కార్యక్రమం.. ఉగ్రవాదులు భారీ ర్యాలీ
- పీవోకేలో హమాస్ నాయకులు భారత వ్యతిరేక కార్యక్రమం
- కార్లు, బైకులు, గుర్రాలతో ఘనస్వాగతం
- భారత నిఘా వర్గాలు అప్రమత్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హమాస్ నాయకులు హల్చల్ సృష్టించారు. పశ్చిమాసియాకే పరిమితమైన వారి ప్రభావం ఇప్పుడు భారత్లో కూడా విస్తరించేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
ఇది కూడా చదవండి: VinFast VF 3: నానో కంటే మరో చిన్న కారు.. ఊపు ఊపేయడానికి వస్తున్న ఈవీ
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఫిబ్రవరి 5, 2025 (బుధవారం) పాకిస్థాన్ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు.. రావలకోట్లోని షహీద్ సబీర్ స్టేడియంలో భారత వ్యతిరేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హమాస్కు చెందిన ఉగ్రవాదులు హాజరయ్యారు. హమాస్ జెండాలు పెట్టుకున్న లగ్జరీ ఎస్యూవీ కార్లు, బైకులు, గుర్రాలతో భారీ ర్యాలీగా వెళ్లి ఘనస్వాగతం పలికారు. జైషే ఉగ్రవాదులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. పూల వర్షం కూడా కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలను బట్టి చూస్తే హమాస్.. తన సామ్రాజాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: S Jaishankar: అమెరికా నుంచి భారతీయులను బహిష్కరించడంపై స్పందించిన జైశంకర్..
భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు హమాస్ తన సామ్రాజ్యా్న్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్, జైష్ కమాండర్ అస్గర్ ఖాన్ కాశ్మీరీతో సహా అగ్ర ఉగ్రవాద నాయకులంతా హాజరయ్యారు. ఇక ఇరాన్లో హమాస్ ప్రతినిధి బృందానికి నాయకుడైన ఖలీద్ అల్-ఖాదౌమి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గతంలో అనేక మంది హమాస్ నాయకులు.. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. దక్షిణాసియాలోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CRDA Letter to Election Commission: రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్..! ఈసీకి సీఆర్డీఏ లేఖ
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..