Madhya Pradesh: బిడ్డను కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి.. ఓ మహిళ అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని కోరింది. ఇంతకీ ఎందుకంటే..తనకు సంతానం కావాలని, అందుకే తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని గ్వాలియర్ జైలు అధికారులకు అభ్యర్థన పెట్టుకుంది. గ్వాలియర్ లోని శివ్ పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్ కు ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది న్యాయస్థానం.
Read Also: Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
Also Read
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
జీవిత ఖైదు పడిని దారా సింగ్ అప్పటి నుంచి గ్వాలియర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన భార్య జైలు అధికారులకు తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని దరఖాస్తు పెట్టుకుంది. తనకు పిల్లలు కావాలని, అందుకే ఆయనను విడుదల చేయాలని జైలు అధికారులను కోరింది. గ్వాలియర్ జైలులో గత ఏడేళ్లుగా దారాసింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పెళ్లి అయిన వెంటనే తన కొడుకు హత్య కేసులో అరెస్ట్ అయ్యాడని, కనీసం పెళ్లి వేడుకలను కూడా ఆస్వాదించలేకపోయానని ఖైదీ తండ్రి కరీం సింగ్ జాతవ్ పేర్కొన్నాడు. తనకు మనవడు కావాలని కోరకుకుంటున్నట్లు వెల్లడించాడు.
మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు పడిన వ్యక్తి సత్ప్రవర్తన కారణంగా రెండేళ్ల తరువాత పెరోల్ మంజూరు చేయొచ్చు. అయితే సదరు మహిళ అభ్యర్థను జైలు సూపరింటెండెంట్ శివ్ పురి ఎస్పీకి పంపినట్లు తెలిపారు. అయతే దీనిపై అంతిమ నిర్ణయం కలెక్టర్ తీసుకుంటారని వెల్లడించారు. అయితే గతంలో కూడా ఓ రాజస్తానీ మహిళ ఇలాంటి అభ్యర్థన పెట్టుకోగా.. అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సంతానం పొందే హక్కు వినియోగించుకునేందు తన భర్తను విడుదల చేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన జోధ్ పూర్ బెంజ్ ఆ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!