Madhya Pradesh: బిడ్డను కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి.. ఓ మహిళ అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని కోరింది. ఇంతకీ ఎందుకంటే..తనకు సంతానం కావాలని, అందుకే తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని గ్వాలియర్ జైలు అధికారులకు అభ్యర్థన పెట్టుకుంది. గ్వాలియర్ లోని శివ్ పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్ కు ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది న్యాయస్థానం.
Read Also: Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
జీవిత ఖైదు పడిని దారా సింగ్ అప్పటి నుంచి గ్వాలియర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన భార్య జైలు అధికారులకు తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని దరఖాస్తు పెట్టుకుంది. తనకు పిల్లలు కావాలని, అందుకే ఆయనను విడుదల చేయాలని జైలు అధికారులను కోరింది. గ్వాలియర్ జైలులో గత ఏడేళ్లుగా దారాసింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పెళ్లి అయిన వెంటనే తన కొడుకు హత్య కేసులో అరెస్ట్ అయ్యాడని, కనీసం పెళ్లి వేడుకలను కూడా ఆస్వాదించలేకపోయానని ఖైదీ తండ్రి కరీం సింగ్ జాతవ్ పేర్కొన్నాడు. తనకు మనవడు కావాలని కోరకుకుంటున్నట్లు వెల్లడించాడు.
మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు పడిన వ్యక్తి సత్ప్రవర్తన కారణంగా రెండేళ్ల తరువాత పెరోల్ మంజూరు చేయొచ్చు. అయితే సదరు మహిళ అభ్యర్థను జైలు సూపరింటెండెంట్ శివ్ పురి ఎస్పీకి పంపినట్లు తెలిపారు. అయతే దీనిపై అంతిమ నిర్ణయం కలెక్టర్ తీసుకుంటారని వెల్లడించారు. అయితే గతంలో కూడా ఓ రాజస్తానీ మహిళ ఇలాంటి అభ్యర్థన పెట్టుకోగా.. అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సంతానం పొందే హక్కు వినియోగించుకునేందు తన భర్తను విడుదల చేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన జోధ్ పూర్ బెంజ్ ఆ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..