Madhya Pradesh: బిడ్డను కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి.. ఓ మహిళ అభ్యర్థన
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని కోరింది. ఇంతకీ ఎందుకంటే..తనకు సంతానం కావాలని, అందుకే తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని గ్వాలియర్ జైలు అధికారులకు అభ్యర్థన పెట్టుకుంది. గ్వాలియర్ లోని శివ్ పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్ కు ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది న్యాయస్థానం.
Read Also: Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
జీవిత ఖైదు పడిని దారా సింగ్ అప్పటి నుంచి గ్వాలియర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన భార్య జైలు అధికారులకు తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని దరఖాస్తు పెట్టుకుంది. తనకు పిల్లలు కావాలని, అందుకే ఆయనను విడుదల చేయాలని జైలు అధికారులను కోరింది. గ్వాలియర్ జైలులో గత ఏడేళ్లుగా దారాసింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పెళ్లి అయిన వెంటనే తన కొడుకు హత్య కేసులో అరెస్ట్ అయ్యాడని, కనీసం పెళ్లి వేడుకలను కూడా ఆస్వాదించలేకపోయానని ఖైదీ తండ్రి కరీం సింగ్ జాతవ్ పేర్కొన్నాడు. తనకు మనవడు కావాలని కోరకుకుంటున్నట్లు వెల్లడించాడు.
మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు పడిన వ్యక్తి సత్ప్రవర్తన కారణంగా రెండేళ్ల తరువాత పెరోల్ మంజూరు చేయొచ్చు. అయితే సదరు మహిళ అభ్యర్థను జైలు సూపరింటెండెంట్ శివ్ పురి ఎస్పీకి పంపినట్లు తెలిపారు. అయతే దీనిపై అంతిమ నిర్ణయం కలెక్టర్ తీసుకుంటారని వెల్లడించారు. అయితే గతంలో కూడా ఓ రాజస్తానీ మహిళ ఇలాంటి అభ్యర్థన పెట్టుకోగా.. అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సంతానం పొందే హక్కు వినియోగించుకునేందు తన భర్తను విడుదల చేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన జోధ్ పూర్ బెంజ్ ఆ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!