Madhya Pradesh: బిడ్డను కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి.. ఓ మహిళ అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని కోరింది. ఇంతకీ ఎందుకంటే..తనకు సంతానం కావాలని, అందుకే తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని గ్వాలియర్ జైలు అధికారులకు అభ్యర్థన పెట్టుకుంది. గ్వాలియర్ లోని శివ్ పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్ కు ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించింది న్యాయస్థానం.
Read Also: Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
Also Read
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
జీవిత ఖైదు పడిని దారా సింగ్ అప్పటి నుంచి గ్వాలియర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన భార్య జైలు అధికారులకు తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని దరఖాస్తు పెట్టుకుంది. తనకు పిల్లలు కావాలని, అందుకే ఆయనను విడుదల చేయాలని జైలు అధికారులను కోరింది. గ్వాలియర్ జైలులో గత ఏడేళ్లుగా దారాసింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పెళ్లి అయిన వెంటనే తన కొడుకు హత్య కేసులో అరెస్ట్ అయ్యాడని, కనీసం పెళ్లి వేడుకలను కూడా ఆస్వాదించలేకపోయానని ఖైదీ తండ్రి కరీం సింగ్ జాతవ్ పేర్కొన్నాడు. తనకు మనవడు కావాలని కోరకుకుంటున్నట్లు వెల్లడించాడు.
మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు పడిన వ్యక్తి సత్ప్రవర్తన కారణంగా రెండేళ్ల తరువాత పెరోల్ మంజూరు చేయొచ్చు. అయితే సదరు మహిళ అభ్యర్థను జైలు సూపరింటెండెంట్ శివ్ పురి ఎస్పీకి పంపినట్లు తెలిపారు. అయతే దీనిపై అంతిమ నిర్ణయం కలెక్టర్ తీసుకుంటారని వెల్లడించారు. అయితే గతంలో కూడా ఓ రాజస్తానీ మహిళ ఇలాంటి అభ్యర్థన పెట్టుకోగా.. అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సంతానం పొందే హక్కు వినియోగించుకునేందు తన భర్తను విడుదల చేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన జోధ్ పూర్ బెంజ్ ఆ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!