Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newly Married Bride Left The Wedding Ceremony In Uttar Pradesh: అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మూడు ముళ్లు పడగానే.. నవ వధువు వెంటనే పెళ్లి పీటలపై నుంచి వెళ్లి వెళ్లిపోయింది. ఏడడుగులు వేయించడానికి అందరూ సిద్ధమవుతున్న తరుణంలో.. ఆ వధువు పెళ్లి పీటలు దిగి, కంగారుగా పరుగెత్తింది. అది చూసి.. పెళ్లికొడుకుతో పాటు ఆ పెళ్లికి విచ్చేసిన అతిథులందరూ షాకయ్యారు. అసలేం జరుగుతోందంటూ ఆందోళన చెందారు. అయితే.. ఆ తర్వాత అసలు విషయం అందరూ శాంతించారు. ఆ వధువు చేసిన పనికి మెచ్చుకొని, ఆమెను శభాష్ అంటూ కొనియాడారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
ఝూన్సీ జిల్లాలోని డోంగ్రీ ప్రాంతంలో కృష్ణ రాజ్పుత్ అనే అమ్మాయికి, యశ్పాల్ సింగ్ అనే కుర్రాడితో పెళ్ళి ఖరారు చేసింది. నిశ్చితార్థం ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు.. మే 16వ తేదీన వారి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి కోసం.. మే 15వ తేదీనే వరుడు, అతని కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. 16వ తేదీన గ్రాండ్గా పెళ్లివేడుకని నిర్వహించారు. వరుడు, వధువుని తయారు చేసి.. పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. వధువు మెడలో వరుడు మూడు ముళ్లు కూడా వేశాడు. ఇక ఏడడుగులే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో.. వధువు ఒక్కసారిగా పెళ్లి పీటలు దిగి పరుగు లంకించింది. దీంతో.. వరుడుతో పాటు బంధుమిత్రులు, అతిథులు కంగారు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. అప్పుడు వధువు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ముందుకొచ్చి.. అసలు నిజం బయటపెట్టాడు. వధువు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోందని, పరీక్షకు హాజరయ్యేందుకు ఆమె అలా వెళ్లిందని చెప్పాడు.
బికినీలో బ్యాక్ చూపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. బాలయ్య, నాగ్ లతో నటించింది కూడా ?
నిజానికి.. ముందుగా వేసిన షెడ్యూల్ ప్రకారం ఆ అమ్మాయి పరీక్ష మే 4వ తేదీన అయిపోవాల్సింది. అయితే.. ఆ సమయంలో అక్కడ ఎన్నికలు నిర్వహించడంతో, పరీక్షను మే 16వ తేదీక వాయిదా వేశారు. అదే రోజు పెళ్లి కూడా నిర్ణయించడంతో.. ఆ అమ్మాయి కన్ఫ్యూజన్లో పడిపోయింది. చివరికి పరీక్ష రాయాలని నిర్ణయించుకొని, తానను పరీక్షకు తప్పకుండా హాజరు అవుతానని కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడింది. అందుకే.. మూడు ముళ్లు పడిన వెంటనే, ఆ యువతి అలా పెళ్లి పీటలు దిగి వెళ్లిపోయిందని తేలింది. ఈ విషయం తెలిసి.. వరుడు, అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే.. ఆ అమ్మాయి మంచి పని చేసిందని కొనియాడారు.
తాజావార్తలు
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!