Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
Newly Married Bride Left The Wedding Ceremony In Uttar Pradesh: అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మూడు ముళ్లు పడగానే.. నవ వధువు వెంటనే పెళ్లి పీటలపై నుంచి వెళ్లి వెళ్లిపోయింది. ఏడడుగులు వేయించడానికి అందరూ సిద్ధమవుతున్న తరుణంలో.. ఆ వధువు పెళ్లి పీటలు దిగి, కంగారుగా పరుగెత్తింది. అది చూసి.. పెళ్లికొడుకుతో పాటు ఆ పెళ్లికి విచ్చేసిన అతిథులందరూ షాకయ్యారు. అసలేం జరుగుతోందంటూ ఆందోళన చెందారు. అయితే.. ఆ తర్వాత అసలు విషయం అందరూ శాంతించారు. ఆ వధువు చేసిన పనికి మెచ్చుకొని, ఆమెను శభాష్ అంటూ కొనియాడారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఝూన్సీ జిల్లాలోని డోంగ్రీ ప్రాంతంలో కృష్ణ రాజ్పుత్ అనే అమ్మాయికి, యశ్పాల్ సింగ్ అనే కుర్రాడితో పెళ్ళి ఖరారు చేసింది. నిశ్చితార్థం ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు.. మే 16వ తేదీన వారి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి కోసం.. మే 15వ తేదీనే వరుడు, అతని కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. 16వ తేదీన గ్రాండ్గా పెళ్లివేడుకని నిర్వహించారు. వరుడు, వధువుని తయారు చేసి.. పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. వధువు మెడలో వరుడు మూడు ముళ్లు కూడా వేశాడు. ఇక ఏడడుగులే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో.. వధువు ఒక్కసారిగా పెళ్లి పీటలు దిగి పరుగు లంకించింది. దీంతో.. వరుడుతో పాటు బంధుమిత్రులు, అతిథులు కంగారు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. అప్పుడు వధువు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ముందుకొచ్చి.. అసలు నిజం బయటపెట్టాడు. వధువు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోందని, పరీక్షకు హాజరయ్యేందుకు ఆమె అలా వెళ్లిందని చెప్పాడు.
బికినీలో బ్యాక్ చూపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. బాలయ్య, నాగ్ లతో నటించింది కూడా ?
నిజానికి.. ముందుగా వేసిన షెడ్యూల్ ప్రకారం ఆ అమ్మాయి పరీక్ష మే 4వ తేదీన అయిపోవాల్సింది. అయితే.. ఆ సమయంలో అక్కడ ఎన్నికలు నిర్వహించడంతో, పరీక్షను మే 16వ తేదీక వాయిదా వేశారు. అదే రోజు పెళ్లి కూడా నిర్ణయించడంతో.. ఆ అమ్మాయి కన్ఫ్యూజన్లో పడిపోయింది. చివరికి పరీక్ష రాయాలని నిర్ణయించుకొని, తానను పరీక్షకు తప్పకుండా హాజరు అవుతానని కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడింది. అందుకే.. మూడు ముళ్లు పడిన వెంటనే, ఆ యువతి అలా పెళ్లి పీటలు దిగి వెళ్లిపోయిందని తేలింది. ఈ విషయం తెలిసి.. వరుడు, అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే.. ఆ అమ్మాయి మంచి పని చేసిందని కొనియాడారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!