Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newly Married Bride Left The Wedding Ceremony In Uttar Pradesh: అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మూడు ముళ్లు పడగానే.. నవ వధువు వెంటనే పెళ్లి పీటలపై నుంచి వెళ్లి వెళ్లిపోయింది. ఏడడుగులు వేయించడానికి అందరూ సిద్ధమవుతున్న తరుణంలో.. ఆ వధువు పెళ్లి పీటలు దిగి, కంగారుగా పరుగెత్తింది. అది చూసి.. పెళ్లికొడుకుతో పాటు ఆ పెళ్లికి విచ్చేసిన అతిథులందరూ షాకయ్యారు. అసలేం జరుగుతోందంటూ ఆందోళన చెందారు. అయితే.. ఆ తర్వాత అసలు విషయం అందరూ శాంతించారు. ఆ వధువు చేసిన పనికి మెచ్చుకొని, ఆమెను శభాష్ అంటూ కొనియాడారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఝూన్సీ జిల్లాలోని డోంగ్రీ ప్రాంతంలో కృష్ణ రాజ్పుత్ అనే అమ్మాయికి, యశ్పాల్ సింగ్ అనే కుర్రాడితో పెళ్ళి ఖరారు చేసింది. నిశ్చితార్థం ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు.. మే 16వ తేదీన వారి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి కోసం.. మే 15వ తేదీనే వరుడు, అతని కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. 16వ తేదీన గ్రాండ్గా పెళ్లివేడుకని నిర్వహించారు. వరుడు, వధువుని తయారు చేసి.. పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. వధువు మెడలో వరుడు మూడు ముళ్లు కూడా వేశాడు. ఇక ఏడడుగులే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో.. వధువు ఒక్కసారిగా పెళ్లి పీటలు దిగి పరుగు లంకించింది. దీంతో.. వరుడుతో పాటు బంధుమిత్రులు, అతిథులు కంగారు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. అప్పుడు వధువు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ముందుకొచ్చి.. అసలు నిజం బయటపెట్టాడు. వధువు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోందని, పరీక్షకు హాజరయ్యేందుకు ఆమె అలా వెళ్లిందని చెప్పాడు.
బికినీలో బ్యాక్ చూపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. బాలయ్య, నాగ్ లతో నటించింది కూడా ?
నిజానికి.. ముందుగా వేసిన షెడ్యూల్ ప్రకారం ఆ అమ్మాయి పరీక్ష మే 4వ తేదీన అయిపోవాల్సింది. అయితే.. ఆ సమయంలో అక్కడ ఎన్నికలు నిర్వహించడంతో, పరీక్షను మే 16వ తేదీక వాయిదా వేశారు. అదే రోజు పెళ్లి కూడా నిర్ణయించడంతో.. ఆ అమ్మాయి కన్ఫ్యూజన్లో పడిపోయింది. చివరికి పరీక్ష రాయాలని నిర్ణయించుకొని, తానను పరీక్షకు తప్పకుండా హాజరు అవుతానని కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడింది. అందుకే.. మూడు ముళ్లు పడిన వెంటనే, ఆ యువతి అలా పెళ్లి పీటలు దిగి వెళ్లిపోయిందని తేలింది. ఈ విషయం తెలిసి.. వరుడు, అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే.. ఆ అమ్మాయి మంచి పని చేసిందని కొనియాడారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!