Custodial Deaths: కస్టడీ మరణాల్లో గుజరాత్ టాప్.. వివరాలు ప్రకటించిన NHRC
Custodial Deaths: పోలీసు కస్టడీ మరణాల్లో దేశంలో గుజరాత్ టాప్ స్థానంలో ఉంది. దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) ప్రకటించింది. 2018 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు 81 పోలీసు కస్టడీ మరణాలతో గుజరాత్.. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని జైళ్లలో మగ్గుతోన్న విచారణ ఖైదీల సంఖ్య 2021 డిసెంబరు నాటికి 4.27 లక్షలకు చేరింది.
Read also: Allu Arjun: ఇదేందయ్యా ఇది.. బన్నీకి జోడిగా AI హీరోయినా..?
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
పోలీసు కస్టడీ మరణాల్లో గుజరాత్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్సభలో ఈ వివరాలు వెల్లడించారు. 2018 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు సంబంధించిన గణాంకాలివి. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అందించిన వివరాలను ప్రస్తావిస్తూ.. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 687 మంది పోలీసు కస్టడీలో మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. ఒక్క గుజరాత్లోనే 81 మరణాలు నమోదయ్యాయని చెప్పారు. మహారాష్ట్రలో 80 ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్ (50), బిహార్ (47), ఉత్తర్ప్రదేశ్ (41), తమిళనాడు (36)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఏడాది వారిగా చూసుకుంటే.. 2022-23లో 164 మంది, 2021-22లో 175 మంది, 2020-21లో 100 మంది, 2019-20లో 112 మంది, 2018-19లో 136 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని జైళ్లలో మగ్గుతోన్న విచారణ ఖైదీల సంఖ్య 2021 డిసెంబరు నాటికి 4.27 లక్షలకు చేరింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) రికార్డుల ఆధారంగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్ర లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘2021 డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్లలో మొత్తం 4,27,165 మంది విచారణ ఖైదీలు ఉన్నారు. నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తోందని మంత్రి అజయ్ కుమార్.. సభ దృష్టికి తీసుకొచ్చారు. నేర చట్టాలు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ మొదలైన వాటిపై సమగ్ర సమీక్ష ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!