Custodial Deaths: కస్టడీ మరణాల్లో గుజరాత్ టాప్.. వివరాలు ప్రకటించిన NHRC
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Custodial Deaths: పోలీసు కస్టడీ మరణాల్లో దేశంలో గుజరాత్ టాప్ స్థానంలో ఉంది. దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) ప్రకటించింది. 2018 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు 81 పోలీసు కస్టడీ మరణాలతో గుజరాత్.. దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని జైళ్లలో మగ్గుతోన్న విచారణ ఖైదీల సంఖ్య 2021 డిసెంబరు నాటికి 4.27 లక్షలకు చేరింది.
Read also: Allu Arjun: ఇదేందయ్యా ఇది.. బన్నీకి జోడిగా AI హీరోయినా..?
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
పోలీసు కస్టడీ మరణాల్లో గుజరాత్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్సభలో ఈ వివరాలు వెల్లడించారు. 2018 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు సంబంధించిన గణాంకాలివి. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అందించిన వివరాలను ప్రస్తావిస్తూ.. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 687 మంది పోలీసు కస్టడీలో మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. ఒక్క గుజరాత్లోనే 81 మరణాలు నమోదయ్యాయని చెప్పారు. మహారాష్ట్రలో 80 ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్ (50), బిహార్ (47), ఉత్తర్ప్రదేశ్ (41), తమిళనాడు (36)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఏడాది వారిగా చూసుకుంటే.. 2022-23లో 164 మంది, 2021-22లో 175 మంది, 2020-21లో 100 మంది, 2019-20లో 112 మంది, 2018-19లో 136 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని జైళ్లలో మగ్గుతోన్న విచారణ ఖైదీల సంఖ్య 2021 డిసెంబరు నాటికి 4.27 లక్షలకు చేరింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) రికార్డుల ఆధారంగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్ర లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘2021 డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్లలో మొత్తం 4,27,165 మంది విచారణ ఖైదీలు ఉన్నారు. నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తోందని మంత్రి అజయ్ కుమార్.. సభ దృష్టికి తీసుకొచ్చారు. నేర చట్టాలు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ మొదలైన వాటిపై సమగ్ర సమీక్ష ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..