Video Call Trap: సెక్స్ వీడియో కాల్ ట్రాప్లో వ్యాపారవేత్త.. ఏకంగా రూ. 2 కోట్లు సమర్పయామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Businessman Loses ₹ 2.69 Crore In Sex Video Call Trap: సెక్స్ టార్షన్ ఉచ్చులో చిక్కుకున్న ఓ గుజరాత్ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. రూ. 2.69 కోట్లు కొల్లగొట్టారు. సెక్స్ వీడియో కాల్ ట్రాప్ లో ఇరుక్కొని వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లో పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న బాధితుడికి గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య సన్నిహితం పెరిగి న్యూడ్ కాల్ చేసుకునే వరకు వెళ్లింది. పక్కా పథకం ప్రకారం సదరు యువతి, బాధితుడిని బట్టలు విప్పి ఫోన్ మాట్లాడేలా ప్రోత్సహించింది.
Read Also: Maoist Party Letter: హిడ్మా చనిపోలేదు.. మావోయిస్టు పార్టీ ఓపెన్ లెటర్
Also Read
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి 'ది ఎండ్'?
- Punjab Blasts: పంజాబ్లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
- Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
దీని తర్వాత బాధితుడికి ఫోన్ చేసి రూ. 50,000 చెల్లించమని డిమాండ్ చేసిందని పోలీసులు వెల్లడించారు. లేకపోతే న్యూడ్ వీడియో క్లిప్ సర్క్యూలేట్ చేస్తానని బెదిరించడంతో బాధితుడు డబ్బులు ఇచ్చాడు. అయితే ఆ తరువాత ఢిల్లీ పోలీస్ ఇన్ప్పెక్టర్ గుడ్డు శర్మ అని చెప్పుకుని మరో వ్యక్తి ఫోన్ చేసి, న్యూడ్ వీడియో నా దగ్గర ఉందని రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బు తీసుకున్నాడు. ఆ తరువాత ఆగస్టు 14న తనను సైబర్ సెల్ పోలీస్ గా పరిచయం చేసుకుని మరో వ్యక్తి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతూ ఏకంగా రూ. 80.97 లక్షలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు.
దీని తర్వాత కూడా వ్యాపారవేత్తకు వేధింపులు ఆగలేదు. యువతి సీబీఐని సంప్రదించిందని.. సీబీఐ అధికారులమని చెబుతూ మరికొంతమంది కాల్ చేయడం ప్రారంభించారు. రూ. 8.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఇలా పలుమార్లు అడిగినంత ఇచ్చుకుంటూ పోయాడు. చివరకు డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు కేసును క్లోజ్ చేస్తుందని చెబుతూ ఫేక్ ఉత్తర్వులు కూడా పంపారు. అయితే ఇది చూసిన తర్వాత అనుమానం వచ్చిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 11 మందికి రూ.2.69 కోట్లు దోపిడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 387 (దోపిడీ), 170 (ప్రభుత్వ సేవకుడిగా నటించడం), 465 (ఫోర్జరీ) 420 (మోసం), మరియు 120-బి (నేరపూరిత కుట్ర) ఇతర నేరాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!