Union Cabinet: రైల్వే ఉద్యోగులకు శుభవార్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ఉద్యోగులకు పండుగ సమయంలో శుభవార్త చెప్పనుంది కేంద్ర సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశం కానున్న కేంద్ర కేబినెట్.. దసరా, దీపావళి ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.. ముఖ్యంగా పలు రంగాల కార్మికులకు ప్రయోజం కలిగేలా నిర్ణయం తీసుకుని.. ఇవాళే ప్రకటన చేయనున్నారు.. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం.. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ను (పీఎల్బీ) ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.. కేంద్ర మంత్రివర్గం 2021-22 కోసం రైల్వే ఉద్యోగులకు ప్రొడక్షన్-లింక్డ్ బోనస్ (పీఎల్బీ)ని క్లియర్ చేసే అవకాశం ఉంది. ప్రతిపాదన ప్రకారం, 11 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు బోనస్ను పొందనున్నారు.
Read Also: Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎంతంటే..?
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
దీని వల్ల భారతీయ రైల్వేపై రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుంది అని లెక్కలు వేస్తున్నారు.. 2021లో, అర్హత కలిగిన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత-అనుసంధాన బోనస్ను 1.156 మిలియన్ల నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.. గతంలో బోనస్పై దాదాపు రూ.1,985 కోట్ల వ్యయం జరిగింది. కాగా, సాధారణంగా దసరా మరియు నవరాత్రి పూజా ఉత్సవాల ముందు బోనస్ ప్రకటిస్తారు.. అయితే.. రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగుల్లో మళ్లీ ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సిబ్బందిని మినహాయించి ఈ బోనస్ను ప్రకటించనుంది కేంద్రం. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 11.56 లక్షల మంది నాన్- గెజిటెడ్ ఉద్యోగులకు కేంద్రం తీసుకోబోయే నిర్ణయంతో ప్రయోజనం కలగబోతోంది..
ఇక, పీఎల్బీ పరిధిలోకి తీసుకొచ్చిన మొదటి ప్రభుత్వ విభాగం భారతీయ రైల్వేనే కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.. తొలిసారిగా 1979-80లో పీఎల్బీని ప్రవేశపెట్టింది. దీనికోసం రైల్వేలో ఆల్ఇండియన్ రైల్వేమెన్ ఫెడరేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ అనే రెండు ఫెడరేషన్స్ను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా.. బోనస్ ఇస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. భారత ఆర్థిక వ్యవస్థలో రైల్వే కూడా ఎప్పటినుంచో కీలకంగా ఉన్న విషయం విదితమే.. మొత్తం ఆర్థిక వ్యవస్థ పనితీరులో మౌలిక సదుపాయాల మద్దతుగా రైల్వే చాలా కీలకంగా ఉంది..
తాజావార్తలు
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!