Union Cabinet: రైల్వే ఉద్యోగులకు శుభవార్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ఉద్యోగులకు పండుగ సమయంలో శుభవార్త చెప్పనుంది కేంద్ర సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశం కానున్న కేంద్ర కేబినెట్.. దసరా, దీపావళి ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.. ముఖ్యంగా పలు రంగాల కార్మికులకు ప్రయోజం కలిగేలా నిర్ణయం తీసుకుని.. ఇవాళే ప్రకటన చేయనున్నారు.. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం.. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ను (పీఎల్బీ) ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.. కేంద్ర మంత్రివర్గం 2021-22 కోసం రైల్వే ఉద్యోగులకు ప్రొడక్షన్-లింక్డ్ బోనస్ (పీఎల్బీ)ని క్లియర్ చేసే అవకాశం ఉంది. ప్రతిపాదన ప్రకారం, 11 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు బోనస్ను పొందనున్నారు.
Read Also: Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎంతంటే..?
Also Read
దీని వల్ల భారతీయ రైల్వేపై రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుంది అని లెక్కలు వేస్తున్నారు.. 2021లో, అర్హత కలిగిన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత-అనుసంధాన బోనస్ను 1.156 మిలియన్ల నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.. గతంలో బోనస్పై దాదాపు రూ.1,985 కోట్ల వ్యయం జరిగింది. కాగా, సాధారణంగా దసరా మరియు నవరాత్రి పూజా ఉత్సవాల ముందు బోనస్ ప్రకటిస్తారు.. అయితే.. రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగుల్లో మళ్లీ ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సిబ్బందిని మినహాయించి ఈ బోనస్ను ప్రకటించనుంది కేంద్రం. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 11.56 లక్షల మంది నాన్- గెజిటెడ్ ఉద్యోగులకు కేంద్రం తీసుకోబోయే నిర్ణయంతో ప్రయోజనం కలగబోతోంది..
ఇక, పీఎల్బీ పరిధిలోకి తీసుకొచ్చిన మొదటి ప్రభుత్వ విభాగం భారతీయ రైల్వేనే కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.. తొలిసారిగా 1979-80లో పీఎల్బీని ప్రవేశపెట్టింది. దీనికోసం రైల్వేలో ఆల్ఇండియన్ రైల్వేమెన్ ఫెడరేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ అనే రెండు ఫెడరేషన్స్ను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా.. బోనస్ ఇస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. భారత ఆర్థిక వ్యవస్థలో రైల్వే కూడా ఎప్పటినుంచో కీలకంగా ఉన్న విషయం విదితమే.. మొత్తం ఆర్థిక వ్యవస్థ పనితీరులో మౌలిక సదుపాయాల మద్దతుగా రైల్వే చాలా కీలకంగా ఉంది..
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?