Gold Seize: చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇందుగలడు సందేహం వలదు.. ఎందెందు వెదకినా.. అన్న చందంగా బంగారం ఎక్కడ బడితే అక్కడ బంగారం బయటపడుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం వివిధ రూపాల్లో తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో బంగారం సీజ్ చేయబడుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి మరీ బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దొరికితే దొంగ… దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది వీరి వ్యవహారం.
తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 89.11 లక్షల విలువ చేసే 2 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టు గా మార్చి పొట్టలో, లోదుస్తుల్లో దాచి తరలించే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో అక్రమ బంగారం గుట్టురట్టయింది. దీంతో బంగారం సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Read Also: IND Vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్గా శిఖర్ ధావన్
సరిగ్గా రెండురోజుల క్రితమే భారీగా బంగారం ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా బంగారాన్ని తరలించేందుకు ఏమాత్రం భయపడడంలేదు. అరెస్ట్ చేస్తారనే భయం కూడా లేకుండా వారిపని వారు చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇండోనేషియా ప్రయాణీకుల వద్ద 76.5 లక్షల విలువ చేసే 1700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని గాజులుగా మార్చి కార్బన్ పేపర్ లో చుట్టి లగేజ్ బ్యాగ్ లో దాచారు. వారి గుట్టు రట్టయింది. దీంతో ప్రయాణీకులను అరెస్ట్ చేసారు. బంగారం రవాణా చేస్తున్న వారిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
అంతకుముందు ఏపీలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన విమానంలో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా, సీఎంఓ కార్యాలయంలో కీలక అధికారి భార్య దుబాయ్ నుండి సుమారు కిలో బంగారం తీసుకుని వచ్చి పట్టుబడింది.
Read Also: Gaddar : ఎర్ర మందారం కలర్ మారుతుందా..?
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!