Gold Seize: చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇందుగలడు సందేహం వలదు.. ఎందెందు వెదకినా.. అన్న చందంగా బంగారం ఎక్కడ బడితే అక్కడ బంగారం బయటపడుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం వివిధ రూపాల్లో తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో బంగారం సీజ్ చేయబడుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి మరీ బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దొరికితే దొంగ… దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది వీరి వ్యవహారం.
తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 89.11 లక్షల విలువ చేసే 2 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టు గా మార్చి పొట్టలో, లోదుస్తుల్లో దాచి తరలించే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో అక్రమ బంగారం గుట్టురట్టయింది. దీంతో బంగారం సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
Read Also: IND Vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్గా శిఖర్ ధావన్
సరిగ్గా రెండురోజుల క్రితమే భారీగా బంగారం ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా బంగారాన్ని తరలించేందుకు ఏమాత్రం భయపడడంలేదు. అరెస్ట్ చేస్తారనే భయం కూడా లేకుండా వారిపని వారు చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇండోనేషియా ప్రయాణీకుల వద్ద 76.5 లక్షల విలువ చేసే 1700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని గాజులుగా మార్చి కార్బన్ పేపర్ లో చుట్టి లగేజ్ బ్యాగ్ లో దాచారు. వారి గుట్టు రట్టయింది. దీంతో ప్రయాణీకులను అరెస్ట్ చేసారు. బంగారం రవాణా చేస్తున్న వారిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
అంతకుముందు ఏపీలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన విమానంలో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా, సీఎంఓ కార్యాలయంలో కీలక అధికారి భార్య దుబాయ్ నుండి సుమారు కిలో బంగారం తీసుకుని వచ్చి పట్టుబడింది.
Read Also: Gaddar : ఎర్ర మందారం కలర్ మారుతుందా..?
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!