Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం
- IMF మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపినాథ్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ హెచ్చరించారు. యుద్ధం ఎలా ముగుస్తుందనే విషయంలో ఇప్పటికీ తీవ్ర అనిశ్చితి నెలకొని ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్కెట్లు పశ్చిమాసియాలో దీర్ఘకాల యుద్ధం కొనసాగే ప్రమాదాన్ని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధం మరో నెల రోజుల పాటు కొనసాగితే ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 నుంచి 140 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా ఆ ధరలు చాలా కాలం పాటు అధిక స్థాయిలో కొనసాగే ప్రమాదం ఉందన్నారు.
Also Read
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 3.1 శాతంగా అంచనా వేస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.5 శాతానికి, కొన్ని సందర్భాల్లో 2 శాతానికి కూడా పడిపోవచ్చని గీతా గోపీనాథ్ హెచ్చరించారు. అయితే పరిస్థితులు త్వరగా చక్కబడతాయని, శాంతి ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం మార్కెట్లలో ఇంకా కనిపిస్తోందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలపై భిన్నంగా ఉంటోందని చెప్పారు.
భారత్పై సుంకాల ప్రభావం
భారత్పై అమెరికా విధించే అవకాశమున్న సెక్షన్ 301 సుంకాల అంశంపైనా గీతా గోపీనాథ్ స్పందించారు. భారత్ను 301 జాబితా నుంచి తొలగించేందుకు ఎలాంటి షరతులు ఉండబోతున్నాయో.. అదనపు సుంకాలు విధిస్తారా లేదా అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ సుంకాలు కేవలం భారత్కే కాకుండా అమెరికాకు కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ఇప్పటికే విధించిన సుంకాల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగినట్లు కనిపిస్తోందన్నారు. 2025 నుంచి అమెరికా వాణిజ్య విధానాలను పరిశీలిస్తే అవి ఊహించలేని విధంగా తరచూ మారుతున్నాయని, అందువల్ల భారత్పై వాస్తవంగా ఎలాంటి సుంకాలు అమలు అవుతాయో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ప్రపంచ మార్కెట్లను నడిపిస్తున్న ఏఐ బూమ్
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల మూలధన మార్కెట్లు రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్నాయనే అంశంపై కూడా గీతా గోపీనాథ్ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లను ముందుకు నడిపిస్తున్న ప్రధాన శక్తి కృత్రిమ మేధస్సు (AI) అని తెలిపారు. ఒకవైపు పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లో భారీ స్థాయిలో ఏఐ పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసే సాంకేతికతగా భావిస్తున్న పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో నిధులు పెట్టుబడి పెడుతున్నారని వివరించారు. అందుకే ప్రపంచంలో ఇతర ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ల విలువలు అత్యధిక స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.
అమెరికా ఆర్థిక వృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని, ఇటీవల నమోదైన అమెరికా వృద్ధిలో దాదాపు సగం భాగం ఏఐ, ఏఐ సంబంధిత పెట్టుబడుల నుంచే వచ్చిందని తెలిపారు. డేటా సెంటర్ల నిర్మాణం, చిప్లు, డేటా ప్రాసెసర్లలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం కావడంతో అక్కడి ఏఐ వృద్ధి ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాలపైనా పడుతోందని గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు.
#WATCH | Mumbai: On the global impact of long-term war, Former Deputy Managing Director, IMF, Gita Gopinath says, “There's still a very high level of uncertainty about how this war will play out. I do worry that markets are not pricing in sufficiently this risk of a prolonged war… pic.twitter.com/lKFCv2PJji
— ANI (@ANI) June 3, 2026
#WATCH | Mumbai: On the impact of US Section 301 tariffs on India’s economy and exports, Former Deputy Managing Director, IMF, Gita Gopinath says, “…there are still the details that have to be determined about what it will take for India to come off the 301 list as opposed to… pic.twitter.com/a7vVCnfCXo
— ANI (@ANI) June 3, 2026
#WATCH | Mumbai: On the US and some East Asian countries having their capital markets at all-time highs amid global instability, Former Deputy Managing Director, IMF, Gita Gopinath says, “What's happening in the US and in Korea and Taiwan is the AI story. On the one hand, you do… pic.twitter.com/FQfGm5iLsU
— ANI (@ANI) June 3, 2026
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?