Menstrual Cramps: రుతుక్రమ నొప్పి ఉపశమనం కోసం మాత్రలు.. 18 ఏళ్ల యువతి మృతి..
- రుతుక్రమ నొప్పుల ఉపశమనం కోసం మాత్రలు..
- డోస్ ఎక్కువ కావడంతో మరణించిన 18 ఏళ్ల యువతి..
- తమిళనాడు తిరుచ్చిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Menstrual Cramps: రుతుక్రమ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ యువతి ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆమె ప్రాణాలను తీసింది. ఈ ఘటన తమిళనాడు లోని తిరుచ్చి జిల్లాలో జరిగింది. ముసిరి తాలూకా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి రుతుక్రమంలో నొప్పి నివారణకు మెడిసిన్స్ తీసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పిని తగ్గించే ప్రయత్నంలో ఎక్కువ ట్యాబ్లెట్లను వేసుకుంది. ఇది ఆమె ప్రాణాలనపు తీసింది. ఈ విషాద ఘటన ఆగస్టు 21న తిరుచ్చిలోని పులివలం ప్రాంతంలో చోటు చేసుకుంది.
READ ALSO: Rahul Gandhi: త్వరలో భారత్ జోడో యాత్ర!.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
Also Read
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
మందులు వేసుకున్న వెంంటనే ఆమె వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. వెంటనే తల్లిదండ్రులు గమనించి ఆమెను ఓమందూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆమె ఇంటికి వచ్చి తర్వాత స్పృహ కోల్పోవడంతో మరోసారి యువతి పేరెంట్స్ ఆమెను తదుపరి చికిత్స కోసం మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి (MGMGH)లో చేర్చారు. చికిత్స తీసుకున్నప్పటికీ, అధిక మోతాదులో మందులు తీసుకోవడంతో ఆమె మరణించింది. హై డోస్ మందులు వాడటం వల్లే ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. యువతి ఇంజనీరింగ్ చదివేందుకు అడ్మిషన్ కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తోంది.
ఇదిలా ఉంటే, ఇదే తరహాలో తిరుచ్చికి చెందిన 34 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి కూడా ఆగస్టు 24న మరణించింది. అబార్షన్ మాత్రలు తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం విషమించి, చనిపోయింది. గర్భవతి అయిన మహిళ వైద్యుడిని సంప్రదించకుండా అబార్షన్ పిల్స్ వేసుకుంది. సమస్య తీవ్రం కావడంతో ఆమెని MGMGHకి తరలించారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆమె మరణించారు.
తాజావార్తలు
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..