Ghaziabad Case: ఘజియాబాద్ రేప్ కేసులో ట్విస్ట్.. ఐదుగురిని ఇరికించేందుకు మహిళ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghaziabad woman’s physical assault case false conspiracy: ఢిల్లీ-ఘజియాబాద్ రేప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐదుగురిని ఇరికించే ప్రయత్నంలో సదరు మహిళ గ్యాంగ్ రేప్ డ్రామా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ రెండు రోజుల క్రితం ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసుల.. ఆమె చెప్పినదాని ప్రకారం ముందుగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగం మహిళ ఆస్తి వివాదంలో కట్టుకథ అల్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ డ్రామాకు సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మీరట్ రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆస్తి వివాదంలో నిందితుడిని ఇరికించేందుకు ఆజాద్ అనే వ్యక్తితో మహిళ తప్పుడు అత్యాచార ఆరోపణలు చేసిందని వెల్లడించారు. ఆజాద్ అతని సహచరులు గౌరవ్, అప్జల్ లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కుట్రకు ఉపయోగించిన ఆల్టో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిపై అత్యాచారం కేసు బుక్ చేసేందుకు మహిళ కుట్ర పన్నినట్లు తేల్చారు.
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
Read Also:China Spy: బౌద్ధ సన్యాసిని ముసుగులో చైనా గూఢాచారి.. అరెస్ట్ చేసిన పోలీసులు
అక్టోబర్ 18 ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ ఘజియాబాద్ లో జరిగిన ఓ బర్త్ డే పార్టీకి వెళ్లివచ్చే సమయంలో బస్టాండ్ లో ఉన్న ఆమెను కారులో అపహరించి రెండు రోజుల పాటు నిర్భందించి ఐదుగురు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్ చొప్పించారని.. బాధిత మహిళ తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో మహిళ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించింది. మొదటగా ఘజియాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు తీసుకెళ్తే, అందుకు ఆమె తిరస్కరించింది. మీరట్ ఆస్పత్రిలో కూడా ఇదే విధంగా చేసింది. చివరకు ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. ఆస్తి వివాదంలో నిందితులను ఇరికించేందుకు అత్యాచారం కుట్రకు పాల్పడినట్లు వెల్లడిచింది. విచారణ సమయంలో ఆజాద్ మొబైల్ స్విచ్ఛాప్ ఉండటం కూడా పోలీసుల అనుమానాలను బలపడేలా చేశాయి. దీంతో అత్యాచారం కుట్ర వీడింది.
जनपद गाजियाबाद के थाना नंदग्राम से सम्बन्धित प्रकरण मे महिला द्वारा अपने साथियो के साथ षडयंत्र रचते हुए दर्शायी गई झूठी घटना के खुलासे के सम्बन्ध मे प्रेस ब्रीफिंग करते हुए श्रीमान @igrangemeerut व #SSP_GZB @IPSMUNIRAJ.1/N@CMOfficeUP @UPGovt @homeupgov @Uppolice @NCWIndia pic.twitter.com/jtA12Q8HUo
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) October 20, 2022
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!