Ghaziabad Case: ఘజియాబాద్ రేప్ కేసులో ట్విస్ట్.. ఐదుగురిని ఇరికించేందుకు మహిళ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghaziabad woman’s physical assault case false conspiracy: ఢిల్లీ-ఘజియాబాద్ రేప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐదుగురిని ఇరికించే ప్రయత్నంలో సదరు మహిళ గ్యాంగ్ రేప్ డ్రామా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ రెండు రోజుల క్రితం ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసుల.. ఆమె చెప్పినదాని ప్రకారం ముందుగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగం మహిళ ఆస్తి వివాదంలో కట్టుకథ అల్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ డ్రామాకు సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మీరట్ రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆస్తి వివాదంలో నిందితుడిని ఇరికించేందుకు ఆజాద్ అనే వ్యక్తితో మహిళ తప్పుడు అత్యాచార ఆరోపణలు చేసిందని వెల్లడించారు. ఆజాద్ అతని సహచరులు గౌరవ్, అప్జల్ లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కుట్రకు ఉపయోగించిన ఆల్టో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిపై అత్యాచారం కేసు బుక్ చేసేందుకు మహిళ కుట్ర పన్నినట్లు తేల్చారు.
Also Read
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
Read Also:China Spy: బౌద్ధ సన్యాసిని ముసుగులో చైనా గూఢాచారి.. అరెస్ట్ చేసిన పోలీసులు
అక్టోబర్ 18 ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ ఘజియాబాద్ లో జరిగిన ఓ బర్త్ డే పార్టీకి వెళ్లివచ్చే సమయంలో బస్టాండ్ లో ఉన్న ఆమెను కారులో అపహరించి రెండు రోజుల పాటు నిర్భందించి ఐదుగురు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్ చొప్పించారని.. బాధిత మహిళ తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో మహిళ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించింది. మొదటగా ఘజియాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు తీసుకెళ్తే, అందుకు ఆమె తిరస్కరించింది. మీరట్ ఆస్పత్రిలో కూడా ఇదే విధంగా చేసింది. చివరకు ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. ఆస్తి వివాదంలో నిందితులను ఇరికించేందుకు అత్యాచారం కుట్రకు పాల్పడినట్లు వెల్లడిచింది. విచారణ సమయంలో ఆజాద్ మొబైల్ స్విచ్ఛాప్ ఉండటం కూడా పోలీసుల అనుమానాలను బలపడేలా చేశాయి. దీంతో అత్యాచారం కుట్ర వీడింది.
जनपद गाजियाबाद के थाना नंदग्राम से सम्बन्धित प्रकरण मे महिला द्वारा अपने साथियो के साथ षडयंत्र रचते हुए दर्शायी गई झूठी घटना के खुलासे के सम्बन्ध मे प्रेस ब्रीफिंग करते हुए श्रीमान @igrangemeerut व #SSP_GZB @IPSMUNIRAJ.1/N@CMOfficeUP @UPGovt @homeupgov @Uppolice @NCWIndia pic.twitter.com/jtA12Q8HUo
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) October 20, 2022
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..