Mahua Moitra: “సీబీఐని నా ఇంటికి పంపించి వేధించాలని అనుకుంటున్నారు”.. “క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో హాట్ హాట్గా పార్లమెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా అభియోగాలను ఎదుర్కొంటున్నారు. క్యాష్ ఫర్ క్వేరీగా చెప్పబడుతున్న ఈ కేసులో ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మోయిత్రాను విచారించింది. తాజాగా ఈ రోజు ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. ప్యానెట్ మొదటి నివేదికను ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ సమర్పించారు.
మహువా మోయిత్రా తీవ్రమైన దుష్ర్పవర్తనకు కఠినంగా శిక్షించబడాలని, అందువల్ల ఆమెను పదిహేడవ లోక్ సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫారసు చేసింది. ఆమె అత్యంత అభ్యంతరకమైన, అనైతిక హేయమైన, నేరపూరిత ప్రవర్తన దృష్టిలో ఉంచుకుని టైమ్ లిమిట్తో భారత ప్రభుత్వం చట్టపరమైన సంస్థాగత విచారణ చేయాలని సిఫారసు చేసింది.
Also Read
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
Read Also: Supreme Court: ‘‘రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం’’.. హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం..
ఎథిక్స్ కమిటీ రిపోర్టును ప్రవేశపెట్టిన వెంటనే టీఎంసీ, కాంగ్రెస్కి చెందిన కొందరు రిపోర్టు కాపీని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కమిటీ సిఫారసులపై ఓటింగ్కి వచ్చే ముందు చర్చ చేపట్టాలని టీఎంసీ సభ్యులు డిమాండ్ చేశారు. మహువాను లోక్ సభ నుంచి బహిష్కరించేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీలోని మంది సభ్యుల్లో 6గురు నివేదికకు అనుకూలంగా ఓటేశారు. నలుగురు విపక్ష సభ్యులు మహువాకు మద్దతుగా నిలిచారు.
ఇదిలా ఉంటే మహువా మోయిత్రాకు ఎథిక్స్ కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు. మరోవైపు ఆమె పార్లమెంట్ వెలుపల మాట్లాడుతూ.. ఎథిక్స్ కమిటీ అన్ని నిబంధలను ఉల్లంఘించిందని ఆరోపించారు. సీబీఐని నా ఇంటికి పంపి, వేధింపులకు గురి చేయాలని అనుకుంటున్నారని అన్నారు.
లోక్సభలో ప్రధాని నరేంద్రమోడీ, వ్యాపారవేత్త అధానీలే టార్గెట్గా ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువామోయిత్రా గిఫ్టులు, లంచం తీసుకుందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. అంతే కాకుండా ఆమె వ్యక్తిగత పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నారని ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన కమిటీ హోం, ఐటీ శాఖల నుంచి నివేదికలను తెప్పించుకుని మహువామోయిత్రాను విచారించింది. మరోవైపు దర్శన్ హీరానందానీ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తాను మహువామోయిత్రాకు గిఫ్టులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!