Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Former Pm Manmohan Singh Passes Away Pm Narendra Modi And Other Leaders Condolenses

Manmohan Singh: దేశం ఆర్థిక వేత్తను కోల్పోయింది.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రుల సంతాపం!

Published Date :December 27, 2024 , 7:27 am
By Chandra Shekhar Pamena
  • తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌..
  • సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు..
Manmohan Singh: దేశం ఆర్థిక వేత్తను కోల్పోయింది.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రుల సంతాపం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manmohan Singh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక, మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read Also: Venkatesh : వారసుడి సినీ ఎంట్రీపై విక్టరీ వెంకటేష్ కామెంట్స్.. ఏమన్నారంటే?

ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఒకరు అని కోనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీ రోల్ పోషించారని.. ఆయన చేసిన సేవ, ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు అని రాష్ట్రపతి పేర్కొన్నారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా ఘన నివాళులర్పిస్తున్నా.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగఢా సానుభూతి తెలియజేస్తున్నాను అని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వెల్లడించారు.

Read Also: Kiccha Sudeep’s Max Review: కిచ్చా సుదీప్ ‘మాక్స్’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

అయితే, భారత్ విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండే ఆర్థికవేత్తగా ఎదిగారని చెప్పుకొచ్చారు. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా తనదైన ముద్ర వేశారని కోనియాడారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు ఎంతో గొప్పగా ఉండేవి. మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా, నేను గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు అనేక విషయాలపై తరుచూ మాట్లాడుకునే వాళ్లమన్నారు. పాలనకు సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఆయన జ్ఞానం, వినయం, ఆలోచనలన్నీ దేశానికి సేవ చేయడం కోసమే ఉపయోగించారని ప్రధాని మోడీ చెప్పారు.

Read Also: Rahul Gandhi: మహారాష్ట్ర పోల్స్ రాహుల్ సంచలన ఆరోపణలు.. రిగ్గింగ్‌ వల్లే బీజేపీ గెలిచింది

కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇక లేరన్న వార్త చాలా బాధగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. ఇక, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ని వేడుకుంటున్నాను అని అమిత్ షా వేడుకున్నారు. అలాగే, దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్‌ సింగ్‌ చిరస్మరణీయులు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. వ్యక్తిగతంగా నాకు ఆయన ఎంతో ఆత్మీయులు.. వారి నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శమైనవి అని చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ తెలియజేస్తున్నాను అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Droupadi Murmu
  • Manmohan Singh
  • Manmohan Singh passes away
  • Narendra Modi

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions