Pakistan: ఇమ్రాన్ ఖాన్ వల్ల భారత్తో సంబంధాలు క్షీణించాయి..
- మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వల్ల భారత్తో సంబంధాలు క్షీణించాయి..
- ప్రధాని మోడీపై ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి..
- భారత్- పాక్ మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు వారధి పాత్రను పోషిస్తా: నవాజ్ షరీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. భారత ప్రధాని మోడీపై ఇమ్రాన్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇరు దేశాల గురించి అసత్య ప్రచారం చేయడం మానేద్దామని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు.
Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
అయితే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుత పాకిస్థాన్ పర్యటన పట్ల నవాజ్ షరీఫ్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సమస్యలపై ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని నవాజ్ అన్నారు. 2015లో లాహోర్కు ప్రధాని మోడీ అకస్మాత్తుగా రాకను కూడా గుర్తు చేశారు. పాత విషయాలను మరచిపోయి.. కొత్తగా ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రారంభించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అలాగే, ఇండియా- పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్, వాణిజ్యం పునరుద్ధరణ జరగాలని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు వారధి పాత్రను పోషించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని నవాజ్ షరీఫ్ అన్నారు.
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వర్ చివరి క్షణాలు.. నెట్టింట వీడియో వైరల్
అయితే, భారత్-పాక్ స్నేహపూర్వకంగా కలిసి ఉండాలని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దాదాపు 70 ఏళ్లు పోరాటం చేశాం.. దీన్ని మరో 70 ఏళ్లు ముందుకు తీసుకెళ్లకూడదని కోరారు. ఇరు దేశాలు కూర్చుని చర్చించుకుని సానుకూలంగా ముందుకు కొనసాగాలన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య వాణిజ్యం నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. ఇక, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్ 15న పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చివరిసారి పాకిస్థాన్లో పర్యటించారు.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!