Pakistan: ఇమ్రాన్ ఖాన్ వల్ల భారత్తో సంబంధాలు క్షీణించాయి..
- మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వల్ల భారత్తో సంబంధాలు క్షీణించాయి..
- ప్రధాని మోడీపై ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి..
- భారత్- పాక్ మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు వారధి పాత్రను పోషిస్తా: నవాజ్ షరీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. భారత ప్రధాని మోడీపై ఇమ్రాన్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇరు దేశాల గురించి అసత్య ప్రచారం చేయడం మానేద్దామని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అయితే, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుత పాకిస్థాన్ పర్యటన పట్ల నవాజ్ షరీఫ్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సమస్యలపై ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని నవాజ్ అన్నారు. 2015లో లాహోర్కు ప్రధాని మోడీ అకస్మాత్తుగా రాకను కూడా గుర్తు చేశారు. పాత విషయాలను మరచిపోయి.. కొత్తగా ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రారంభించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అలాగే, ఇండియా- పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్, వాణిజ్యం పునరుద్ధరణ జరగాలని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు వారధి పాత్రను పోషించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని నవాజ్ షరీఫ్ అన్నారు.
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వర్ చివరి క్షణాలు.. నెట్టింట వీడియో వైరల్
అయితే, భారత్-పాక్ స్నేహపూర్వకంగా కలిసి ఉండాలని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దాదాపు 70 ఏళ్లు పోరాటం చేశాం.. దీన్ని మరో 70 ఏళ్లు ముందుకు తీసుకెళ్లకూడదని కోరారు. ఇరు దేశాలు కూర్చుని చర్చించుకుని సానుకూలంగా ముందుకు కొనసాగాలన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య వాణిజ్యం నిలిచిపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. ఇక, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్ 15న పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చివరిసారి పాకిస్థాన్లో పర్యటించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!