Delhi: ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసిన ఈడీ మాజీ అధికారి రాజీనామా
- ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసిన ఈడీ మాజీ అధికారి రాజీనామా
- 16 సంవత్సరాలు సర్వీస్ తర్వాత కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరు సిట్టింగ్ ముఖ్యమంత్రుల అరెస్ట్లను పర్యవేక్షించిన ఐఆర్ఎస్ అధికారి కపిల్ రాజ్ తన సర్వీస్కు గుడ్బై చెప్పారు. 16 సంవత్సరాలు సర్వీసు తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లపై కేసులు సహా ఉన్నత స్థాయి ఈడీ దర్యాప్తులకు పేరుగాంచిన కపిల్ రాజ్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Trump: మాతో జాగ్రత్త.. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)లో ఎనిమిదేళ్ల పాటు కపిల్ రాజ్ పనిచేశారు. కపిల్ రాజ్ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయంగా సున్నితమైన రెండు అరెస్ట్లను పర్యవేక్షించారు. భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన మనీలాండరింగ్ నిరోధక కేసుల్లో కీలక పాత్ర పోషించారు. కపిల్ రాజ్.. 2009 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి. 16 సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాజ్ రాజీనామాను జూలై 17 నుంచి భారత రాష్ట్రపతి ఆమోదించారని నివేదికలు అందాయి. ప్రస్తుతం కపిల్ రాజు వయసు 45 ఏళ్లు. ఇంకా 15 సంవత్సరాల సర్వీస్ ఉంది. ప్రస్తుతం రాజ్.. ఢిల్లీలోని జీఎస్టీ విభాగంలో అదనపు కమిషనర్గా పనిచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: China: టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై చైనా సంచలన ప్రకటన
గత ఏడాది జనవరిలో భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుకు ఆయన నాయకత్వం వహించారు. రాంచీలోని రాజ్ భవన్లో సోరెన్ రాజీనామా సమయంలో రాజ్ అక్కడే ఉన్నారని, అతన్ని అదుపులోకి తీసుకున్నారని జాతీయ మీడియా తెలిపింది. ఇక మార్చిలో ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసినప్పుడు రాజ్ కూడా ఆయన నివాసంలో ఉన్నారు. అరెస్ట్ మెమో తయారీ మరియు డెలివరీని రాజ్ పర్యవేక్షించారని తెలిపింది. కపిల్ రాజ్ సోదాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించడం, రాజకీయ నాయకుల ప్రశ్నాపత్రాలను పరిశీలించడం మరియు కార్యకలాపాల సమయంలో దర్యాప్తు బృందాలను ప్రేరేపించడంలో ప్రసిద్ధి చెందారని నివేదించింది. ఇక ముంబై పోస్టింగ్ సమయంలో ప్రధాన ఆర్థిక నేరాల దర్యాప్తులను కూడా నిర్వహించారు. అలాగే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ మనీలాండరింగ్ కేసులు కూడా డీల్ చేశారు.
కపిల్ రాజ్.. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాకు చెందినవాడు. ఎలక్ట్రానిక్స్లో బీటెక్ డిగ్రీని చదివారు. కెరీర్లో కీలకమైన దర్యాప్తు విభాగాల్లో ముఖ్యంగా కస్టమ్స్, జీఎస్టీ నిఘా మరియు ఆర్థిక నేరాల అమలుకు సంబంధించిన పోస్టింగ్లు నిర్వహించారు.

తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!