Ragging: ‘‘టాయ్లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
- ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
- టాయిలెట్ సీటుని నాకించి వికృత చేష్టలు..
- అవమానం భరించలేక ఆత్మహత్య..
- తన కొడుకు బాధల్ని సోషల్ మీడియాలో వెల్లడించిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragging: ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడదు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Read Also: Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
‘‘మిహిర్ని కొట్టారు. తిట్టారు. అతడి చివరి రోజు ఎవరూ ఊహించలేని అవమానాన్ని భరించాడు. అతడిని బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకెళ్లారు. టాయిలెట్ సీటను బలవంతంగా నాకించారు. టాయిలెట్ ఫ్లష్ చేసిన తర్వాత అతడి తలను టాయిలెట్లో పెట్టారు. ఈ క్రూరమైన చర్యలు అతడి జీవితాన్ని విచ్ఛిన్నం చేశాయి.’’ ఆమె చెప్పింది. తన కొడుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుసుకునేందుకు తాను, తన భర్త సమాచారాన్ని సేకరించామని రజ్నా చెప్పారు. స్నేహితులు, పాఠశాల సహచరులతో మాట్లాడిన తర్వాత, తన కొడుకు ఎంతటి బాధల్ని అనుభవించాడో తెలుసుకున్నామని, పాఠశాలలో, స్కూల్ బస్సులో విద్యార్థులు మిహిర్ని క్రూరంగా ర్యాగింగ్ చేశారని, కొట్టారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కేవలం శారీరక వేధింపులే కాకుండా, అతడి చర్మం రంగుని ఆధారంగా చేసుకుని దూషించారని, ఎగతాళి చేశారని చెప్పారు. తన కొడుకు మరణించడాన్ని కొందరు సెలబ్రేట్ చేసుకున్నారని ఆమె పేర్కొంది. తన కొడుకు మరణంపై నిష్పాక్షిక దర్యాప్తుని కోరుతూ, సేకరించిన ఆధారాలను సీఎం ఆఫీస్, డీజీపీ ఆఫీస్కి సమర్పించినట్లు తెలిపారు. త్రిప్పునితురలోని హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, డిజిటల్ ఆధారాలు సేకరించడంలో జాప్యం నేరస్తుల ఆధారాలు చెరిపేసే వీలుందని మిహిర్ తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకుకి న్యాయం చేయాలని, మిహిర్ల మరో బిడ్డ బాధపడకూదని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?