Ragging: ‘‘టాయ్లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
- ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
- టాయిలెట్ సీటుని నాకించి వికృత చేష్టలు..
- అవమానం భరించలేక ఆత్మహత్య..
- తన కొడుకు బాధల్ని సోషల్ మీడియాలో వెల్లడించిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragging: ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడదు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Read Also: Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
‘‘మిహిర్ని కొట్టారు. తిట్టారు. అతడి చివరి రోజు ఎవరూ ఊహించలేని అవమానాన్ని భరించాడు. అతడిని బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకెళ్లారు. టాయిలెట్ సీటను బలవంతంగా నాకించారు. టాయిలెట్ ఫ్లష్ చేసిన తర్వాత అతడి తలను టాయిలెట్లో పెట్టారు. ఈ క్రూరమైన చర్యలు అతడి జీవితాన్ని విచ్ఛిన్నం చేశాయి.’’ ఆమె చెప్పింది. తన కొడుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుసుకునేందుకు తాను, తన భర్త సమాచారాన్ని సేకరించామని రజ్నా చెప్పారు. స్నేహితులు, పాఠశాల సహచరులతో మాట్లాడిన తర్వాత, తన కొడుకు ఎంతటి బాధల్ని అనుభవించాడో తెలుసుకున్నామని, పాఠశాలలో, స్కూల్ బస్సులో విద్యార్థులు మిహిర్ని క్రూరంగా ర్యాగింగ్ చేశారని, కొట్టారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కేవలం శారీరక వేధింపులే కాకుండా, అతడి చర్మం రంగుని ఆధారంగా చేసుకుని దూషించారని, ఎగతాళి చేశారని చెప్పారు. తన కొడుకు మరణించడాన్ని కొందరు సెలబ్రేట్ చేసుకున్నారని ఆమె పేర్కొంది. తన కొడుకు మరణంపై నిష్పాక్షిక దర్యాప్తుని కోరుతూ, సేకరించిన ఆధారాలను సీఎం ఆఫీస్, డీజీపీ ఆఫీస్కి సమర్పించినట్లు తెలిపారు. త్రిప్పునితురలోని హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, డిజిటల్ ఆధారాలు సేకరించడంలో జాప్యం నేరస్తుల ఆధారాలు చెరిపేసే వీలుందని మిహిర్ తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకుకి న్యాయం చేయాలని, మిహిర్ల మరో బిడ్డ బాధపడకూదని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!