Mamata Benerjee: దుర్గాపూజ కోసం పూజా కమిటీలకు రూ. 60 వేల గ్రాంట్
Mamata Benerjee: రాష్ట్రంలో దుర్గాపూజ నిర్వహణ కమిటీల గ్రాంట్ను రూ.50,000 నుంచి రూ.60,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు సీఎం బెనర్జీ సెలవులు కూడా ప్రకటించారు. గతేడాది దుర్గాపూజ కమిటీలకు రూ.50వేలు ఆర్థిక సాయం అందిందని, ఈ ఏడాది కమిటీలకు రూ.60వేలు అందజేస్తామని మమతా బెనర్జీ తెలిపారు. పూజా కమిటీలు ఇచ్చే విద్యుత్ ఛార్జీలపై రాయితీని ప్రస్తుతం 50 శాతం నుంచి 60 శాతానికి పెంచుతామని ఆమె తెలిపారు.కమ్యూనిటీ దుర్గాపూజ నిర్వాహకులతో జరిగిన సమన్వయ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారు. కమ్యూనిటీ దుర్గా పూజ క్లబ్లకు డబ్బు ఇవ్వాలని 2018లో టీఎంసీ ప్రభుత్వం నిర్ణయించింది. బెంగాల్లో దుర్గాపూజ వేడుకలు తరచుగా రాజకీయ సమస్యగా మారాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా వేడుకలు అంత సందడిగా జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు.
Delhi: 3కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళిక
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ప్రారంభం రోజైన సెప్టెంబర్ 1న కోల్కతాలో భారీ ర్యాలీ జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. దుర్గా పూజకు వారసత్వ ట్యాగ్ని అందించిన యునెస్కోకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని రంగుల మయం చేయాలని, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పూజా కమిటీలు, ప్రజలకు పిలుపునిచ్చారు. యునెస్కో సభ్యులతోపాటు విదేశీ ప్రతినిధుల బృందాలు కూడా కోల్కతాను సందర్శిస్తాయని అన్నారు. భారీ ర్యాలీతో ప్రారంభమయ్యే దుర్గా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 8న మెగా కార్నివాల్తో ముగుస్తాయని వివరించారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!