Assam Floods: అస్సాంలో భయంకరంగా వరద పరిస్థితి.. 5 లక్షల మందిపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Floods: అస్సాంలో వరద పరిస్థితి భయంకరంగా మారింది. వరదల కారణంగా ఒకరు మరణించగా.. సుమారు 5 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఇప్పటికిప్పుడు అస్సాంలో వరద పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించలేదు. బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నందున వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Read also: Viral News: ఛీ.. ఛీ.. ఇలాంటివి చూస్తే ఇక పండ్లను కొనరు..
Also Read
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరదల నుండి ఇప్పుడే ఉపశమనం లభించదని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. భారీ వర్షాలతో ఇంకా నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదల్గురి జిల్లాలోని తముల్పూర్లో వరదల కారణంగా ఒకరు మరణించారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) నివేదిక ప్రకారం, వరద కారణంగా గురువారం సాయంత్రం వరకు 4.95 లక్షల మంది ప్రభావితమయ్యారు.
Read also: Purnananda Case : పూర్ణనంద రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
నేమతిఘాట్ (జోర్హాట్), ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) నివేదిక పేర్కొంది. పుతిమరి (కామ్రూప్), పగ్లగియా (నల్బరి) మరియు మానస్ (బార్పేట) వంటి ఇతర నదులు కూడా ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడం మరియు కొన్ని గుడిసెలు ధ్వంసం కావడంతో చాలా మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఇప్పటి వరకు 16 జిల్లాలు, మరో నాలుగు సబ్ డివిజన్లు వరదల బారిన పడ్డాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దెబ్బతిన్న బజాలీ సబ్ డివిజన్లో 2.60 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారని అస్సాం అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..