Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో మొదటి ఎలివేటెడ్ ట్యాక్సీవే ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటి ఎలివేటెడ్ ట్యాక్సీవేను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొదటి ఎలివేటెడ్ ట్యాక్సీవే కావడం విశేషం. దిల్లీ విమానాశ్రయంలో నిర్మించిన ‘ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే’లతోపాటు నాలుగో రన్ వేను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించారు. వంతెన తరహా టాక్సీవే కలిగి ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయం ఇదే.
Read also: Dasoju Sravan : రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
దేశంలో అతిపెద్దదైన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే (ECT)లతోపాటు నాలుగో రన్ వేను పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించారు. దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. కొత్తగా ఈసీటీ అందుబాటులోకి రావడంతో.. కింది నుంచి రోడ్డు మార్గం.. పైనుంచి వంతెన తరహా టాక్సీవే కలిగి ఉన్న దేశంలోని ఏకైక విమానాశ్రయంగా ఐజీఐఏ అవతరించింది. విమానాశ్రయంలోని టర్మినళ్లు, హ్యాంగర్లను రన్వేలతో అనుసంధానించే ప్రత్యేక మార్గాలే ఈ టాక్సీవేలు. ఈసీటీ పొడవు 2.1 కి.మీలు ఉంది. ఇది దిల్లీ విమానాశ్రయంలోని ఉత్తర, దక్షిణ ఎయిర్ఫీల్డ్లను అనుసంధానిస్తుంది. మూడో రన్వే నుంచి టర్మినల్-1కి మధ్య దూరాన్ని ఏడు కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది. ఏ-380, బీ-777, బీ-747 సహా వైడ్-బాడీ విమానాలు దీనిపైనుంచి రాకపోకలు సాగించవచ్చు. ఇప్పటికే దిల్లీ ఎయిర్పోర్టుకు రోజూ 1500కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మున్ముందు మరింత రద్దీని తట్టుకునేలా.. ప్రయాణికుల సమయం ఆదా చేసేలా సౌకర్యాల కల్పనలో భాగంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగు రన్వేలను కలిగి ఉంటుంది.
తాజావార్తలు
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..