Arvind Kejriwal: ఇండియా కూటమి భయంతోనే “భారత్” .. తర్వాత భారత్ పేరును బీజేపీగా మారుస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇండియా పేరును ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’ని మారుస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలమిస్తూ.. జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా మారడం చర్చకు దారి తీసింది.
ఇదిలా ఇండియా పేరు భారత్ గా మారుస్తారనే రూమర్స్ నడుమ ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలకు దిగారు. ప్రతిపక్ష ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. ఇండియా అని పేరు పెట్టడం వల్ల బీజేపీ ఓట్లు తగ్గుతాయని భయపడుతోందని అందుకే ఇలాంటి వ్యూహాలను అవలంభిస్తోందని ఆయన అన్నారు. బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం ఒక్క పార్టీదే కాదని 140 కోట్ల మంది ప్రజలదని, రేపు ఇండియా కూటమి భారత్ గా పేరు మార్చుకుంటే, భారత్ పేరు మారుస్తుందా..భారత్ పేరును బీజేపీ అని పెడుతుందా..? అని ప్రశ్నించారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: KL Rahul: కేఎల్ రాహుల్ను జట్టులోకి తీసుకోవాలంటే.. అయ్యర్ను పక్కన పెట్టాల్సిందే!
పేరు మార్పును జోక్ గా అభివర్ణించారు. ఇండియా పేరును భారత్ గా మార్చడం వల్ల విపక్ష కూటమికి కొన్ని ఓట్లు తగ్గవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ పార్టీలు కూడా ఈ పేరు మార్పు వివాదంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ, ఇండియా కూటమికి భయపడుతోందని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగంలో భారత్ అనే పదం ఉందని, ఇండియాను భారత్ గా మార్చాల్సిన అవసరం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ.. అన్ని మతాలను గౌరవించుకోవాలని, ఏ మతం గురించి తప్పుగా మాట్లాడటం సరికాదని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఉదయనిధి పేరును మాత్రం ప్రస్తావించలేదు. నేను కూడా సనాతన మతానికి చెందిన వాడినే అని.. ఒకరి విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడటం తప్పని అన్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ గురించి మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీ ఈ అంశంపై చర్చ ప్రారంభించిందని ఎద్దేవా చేశారు.
#WATCH | Delhi: "If an alliance of some parties become India, would they change the name of the country? The country belongs to 140 crore people, not to a party. Let's assume if the India alliance renames itself as Bharat, would they rename Bharat as BJP then?… What's this… pic.twitter.com/NGfyY9J9P7
— ANI (@ANI) September 5, 2023
తాజావార్తలు
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!