Tamil Nadu: దారుణం.. 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. అల్లుడ్ని చంపిన మామ
- తమిళనాడులో దారుణం
- 3 నెలల క్రితం ప్రేమ పెళ్లి
- అల్లుడ్ని చంపిన మామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో దారుణం జరిగింది. అల్లుడిని మామ అత్యంత ఘోరంగా హతమార్చాడు. కొడవలితో తల, చేతులు, కాళ్లపై పదే పదే నరకడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులోని రామనాయకన్పట్టికి చెందిన పాల వ్యాపారి రామచంద్రన్ (24), బట్లగుండు సమీపంలోని గణపతిపట్టికి చెందిన బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్తి (21) ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. అనంతరం ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి పెళ్లికి యువతి కుటుంబం వ్యతిరేకించింది. దీంతో ఇద్దరూ మూడు నెలల క్రితం పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు.
Also Read
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇది కూడా చదవండి: Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్
ఆదివారం సాయంత్రం రామచంద్రన్ ద్విచక్ర వాహనంపై కూజిపట్టికి వెళుతుండగా కూట్టతు అయ్యంపాలయం వంతెన సమీపంలో అతని మామ చంద్రన్ (49) అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. అనంతరం కొడవలితో దాడి చేశాడు. రామచంద్రన్ తల, చేతులు, కాళ్లపై పదే పదే దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Meloni: ట్రంప్ శాంతికర్త అంటూ షెహబాజ్ షరీఫ్ పొగడ్తలు.. మెలోని సంజ్ఞలు వైరల్
జంట వేర్వేరు కులాలకు చెందినవారు. అయితే పరువు హత్యను పోలీసులు తోసిపుచ్చారు. బాధితులిద్దరూ షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు కాదని.. అయితే హత్య వెనుక ఉన్న కారణాన్ని వెలికితీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తమిళనాడులో నేరాలు పెరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. అధికార డీఎంకే ఆరోపణలను తోసిపుచ్చింది. నేరాలు చాలా వరకు వ్యక్తిగత శత్రుత్వం వల్లే జరిగాయని, ప్రభుత్వం అటువంటి కేసులన్నింటిలో కఠినమైన చర్యలు, వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: మోడీ మంచి అవకాశాన్ని కోల్పోయారు.. శాంతి సదస్సుకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టిన శశిథరూర్
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!