Karnataka: పసుపు చేనులో గంజాయి సాగు.. తండ్రీ, కొడుకు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: బిడ్డ బలహీనంగా ఉన్నాడు పండ్లు పెట్టమని వైద్యుడు చెప్తే బలానికి రేగిపళ్ళుపెట్టిందని.. ఏదైనా పంటేగా అనుకున్నారేమో గాని ఓ తండ్రీ కొడుకులు గంజాయి పంట పండించారు. పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసీ ఈ అక్రమానికి పాల్పడ్డారు. పసుపు పంటను సాగు చేస్తున్నట్లు అందరిని నమ్మించారు. అయితే నిజం నిప్పులాంటిదని.. గుప్పెట్లో దాగదు అన్నట్లు సమాచారం పోలీసులకు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం లోని హనూర్ తాలూకా ఆనెగుండి గ్రామం లో ఎస్ బాలు (65), మహాలింగ (35) అనే తండ్రీ కొడుకులు నివసిస్తున్నారు.
Read also:Delhi Airport: ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. విమానాల దారి మళ్లీంపు
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
కాగా వారికి ఉన్న పొలంలో పసు పంటను సాగు చేస్తున్నారు. అయితే ఆ పసుపు చేను పేరుకు మాత్రమే పసుపు చేను. పసుపు ముసుగులో మాధకద్రవ్యాల పరిధి లోకి వచ్చే గంజాయి పంటను అక్రమంగా సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ పొలం లోపల చూడగా పసుపు పంట మధ్యలో గంజాయి పంటను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీనితో పోలీసులు ఆ తండ్రీ కొడుకులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. కాగా పసుపు పంట మధ్యలో అక్రమంగా పెంచిన సుమారు 2 లక్షల విలువైన 95 గంజాయి మొక్కలను (34 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!