Delhi March: నేటి మధ్యాహ్నం చలో ఢిల్లీకి రైతుల సంఘాల పిలుపు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
- నేడు ఢిల్లీ మార్చ్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..
- పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్..
- ఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi March: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లాంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు నేడు మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతులు రెడీ అవుతున్నారు. ఢిల్లీ చేరుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మంది ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, రైతుల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ నివాసానికి దిల్ రాజు, కొరటాల
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు.. రైతుల మార్చ్ పై హర్యానా సర్కార్ కూడా అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఎస్ఎంఎస్ సేవలను ఆపేసింది. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఈ సేవలను బంద్ చేస్తున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. రైతులు ఆందోళనలు చేపట్టి ఈరోజుకి 307 రోజులు అవుతుందని చెప్పుకొచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు మార్చ్ తలపెట్టామని వెల్లడించారు.
Read Also: Crime News: హషీమ్ బాబా గ్యాంగ్ షూటర్ సోనూ మట్కా ఎన్కౌంటర్..
అయితే, దేశం మొత్తం రైతులకు అండగా నిలుస్తున్నా.. ప్రధాని మోడీ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారని రైతు సంఘాల నేతలు విమర్శించారు. ఇప్పటికే రెండు సార్లు రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు జరగడంతో.. రైతులపై పోలీసులు బష్ప వాయువును ప్రయోగించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.
తాజావార్తలు
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..