Delhi March: నేటి మధ్యాహ్నం చలో ఢిల్లీకి రైతుల సంఘాల పిలుపు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
- నేడు ఢిల్లీ మార్చ్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..
- పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్..
- ఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi March: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లాంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు నేడు మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతులు రెడీ అవుతున్నారు. ఢిల్లీ చేరుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మంది ఈరోజు మధ్యాహ్నం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, రైతుల కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ నివాసానికి దిల్ రాజు, కొరటాల
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
మరోవైపు.. రైతుల మార్చ్ పై హర్యానా సర్కార్ కూడా అంబాలా జిల్లాలో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఎస్ఎంఎస్ సేవలను ఆపేసింది. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఈ సేవలను బంద్ చేస్తున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. రైతులు ఆందోళనలు చేపట్టి ఈరోజుకి 307 రోజులు అవుతుందని చెప్పుకొచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు మార్చ్ తలపెట్టామని వెల్లడించారు.
Read Also: Crime News: హషీమ్ బాబా గ్యాంగ్ షూటర్ సోనూ మట్కా ఎన్కౌంటర్..
అయితే, దేశం మొత్తం రైతులకు అండగా నిలుస్తున్నా.. ప్రధాని మోడీ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారని రైతు సంఘాల నేతలు విమర్శించారు. ఇప్పటికే రెండు సార్లు రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు జరగడంతో.. రైతులపై పోలీసులు బష్ప వాయువును ప్రయోగించారు. ఈ సందర్బంగా పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!