Kejriwal: మాయావతి ఇల్లు కోరిన కేజ్రీవాల్! ఆప్ అధ్యక్షుడికి ఏ బంగ్లా కేటాయించారంటే..!
- మాయావతి ఇల్లు కోరిన కేజ్రీవాల్!
- ఆప్ అధ్యక్షుడికి వేరే బంగ్లా కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లా కేటాయించారు. ఏడాది తర్వాత కొత్త బంగ్లాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబర్ 4, 2024న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. వాస్తవంగా 10 రోజుల్లోనే జాతీయ అధ్యక్షుడికి ఢిల్లీలో అధికారికంగా ప్రభుత్వ బంగ్లాను ఏర్పాటు చేయాలి.. కానీ ఇప్పటి వరకు కేటాయించలేదు. తాజాగా కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం బంగ్లా కేటాయించింది.
ఇది కూడా చదవండి: Singer Maithili Thakur: మోడీచే ప్రశంసలు.. ఇప్పుడు బీహార్ బీజేపీ మంతనాలు.. మైథిలి ఠాకూర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఇక బంగ్లా కేటాయింపుల్లో భాగంగా కేజ్రీవాల్.. గతంలో మాయావతి నివాసం ఉన్న రోడ్డు నెంబర్ 35, లోధి ఎస్టేట్లోని బంగ్లాను కేటాయించాలని కోరారు. కానీ ఆ బంగ్లాను ప్రస్తుతం వేరే కేంద్రమంత్రికి కేటాయించేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా మరొక బంగ్లాలోకి వెళ్లాల్సి వచ్చింది.
దాదాపు ఏడాది తర్వాత కేజ్రీవాల్కు ఢిల్లీలోని 95, లోధి ఎస్టేట్లోని టైప్ VII బంగ్లా కేటాయించారు. జాతీయ అధ్యక్షుడిగా తనకు బంగ్లా కేటాయించలేదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ బంగ్లా కేటాయించింది. ఈ బంగ్లా ఎదురుగానే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఉంటున్నారు. కేజ్రీవాల్ ఈ బంగ్లాలోకి మకాం మారిస్తే మాత్రం.. శశిథరూర్ పొరుగువాడు అవుతారు. ఇదిలా ఉంటే గతంలో మాయావతి నివాసం ఉన్న 35, లోధి ఎస్టేట్లోని బంగ్లాను కేటాయించాలని కేజ్రీవాల్ అభ్యర్థించారు. కానీ జూలైలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి ఈ బంగ్లా కేటాయించడంతో ఇప్పుడు కేజ్రీవాల్కు వేరే బంగ్లా కేటాయించాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Bihar Assembly Election 2025: నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం కేజ్రీవాల్ ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్కు కేటాయించిన 5వ నెంబర్ ఫిరోజ్షా రోడ్లోని ఇంట్లో బస చేస్తున్నారు. వాస్తవంగా జాతీయ పార్టీల అధ్యక్షులకు పద్ధతి ప్రకారం కేజ్రీవాల్కు పది రోజుల్లో అధికారిక వసతి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం గతంలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కానీ ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వం బంగ్లా కేటాయించింది. సోమవారమే కేజ్రీవాల్ బంగ్లాను పరిశీలించి వచ్చినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..