Siddaramaiah: ఏపీ, తమిళనాడులో కర్ణాటక పరిస్థితి కనిపించదు.. “కన్నడ” ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి..
- కర్ణాటకలో ఉండేవారు కన్నడ నేర్చుకోవాలి..
- ఏపీ
- తమిళనాడులో కర్ణాటక పరిస్థితి లేదు..
- మాతృభాషలోనే మాట్లాడాలి..
- సీఎం సిద్ధరామయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కన్నడ భాష, నేల, నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కన్నడిగుడిపై ఉందని, రాష్ట్రంలో కన్నడ వాతావరణాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. కన్నడ వాతావరణాన్ని కల్పించడం అందరి కర్తవ్యమని, అందుకోసం కర్ణాటకలో నివసించే వారందరూ కన్నడ నేర్చుకోవాలని, అలా మౌనంగా ఉండలేమని ఆయన అన్నారు. కన్నడిగులు పెత్తనం చేసేవారు కాదని, కన్నడపై ప్రేమ పెంచుకోవాలని, ఇతర రాష్ట్రాల్లోని భాషోన్మాదులుగా మారకూడదని సూచిస్తూనే, మన భూమి, మన భాష, దేశంపై గౌరవం, అభిమానం పెంపొందించుకోవాలని ఆయన అన్నారు.
Read Also: Summer solstice: రేపు ఏడాదిలోనే ‘‘సుదీర్ఘమైన పగలు’’.. అయనాంతాలు అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతాయి..?
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
కర్ణాటకలో నివసించే వారు కన్నడ మాట్లాడాలని, కన్నడ తప్ప మరే భాష మాట్లాడకూడదని ప్రతిజ్ఞ చేయాలని, కన్నడిగులు ఉదారంగా ఉంటారని, అందుకే ఇతర భాషలు మాట్లాడే వారు కూడా మాట్లాడే వాతావరణం కర్ణాటకలో ఉందని, కన్నడ నేర్చుకోకుండా జీవించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఈ పరిస్థితి కనిపించడని, వారు మాతృభాషలో మాట్లాడుతారని సిద్ధరామయ్య అన్నారు. మనం కూడా మన మాతృభాషలో మాట్లాడటం మనకెంతో గర్వకారణమని చెప్పారు.
కన్నడ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక నామకరణ సువర్ణ మహోత్సవ వేడుకల్లో భాగంగా విధానసౌధ పశ్చిమ ద్వారం సమీపంలో నాదదేవి భువనేశ్వరి అమ్మవారి కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమిపూజ అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో కన్నడలో మాట్లాడటం రాదని చెబుతూ, స్థానికులు ఇతర రాష్ట్రాల వారిపై దాడికి పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!