Karnataka: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- కర్ణాటకలోని కొడగులో ఘటన
- సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షణికావేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదాన్ని నింపింది. అప్పటి దాకా కలిసి మెలిసి తిరిగిన సహచర విద్యార్థిని విగతజీవిగా మారిపోవడంతో ఆ యువతుల గుండెలు తట్టుకోలేకపోయాయి. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోయాయన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘోర విషాద ఘటన కర్ణాటకలోని కొడగులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
19 ఏళ్ల తేజస్విని కళాశాల హాస్టల్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈశాన్య కర్ణాటకలోని రాయచూర్ నివాసి మహంతప్ప ఏకైక కుమార్తె తేజస్విని. కొడగు జిల్లా పొన్నంపేటలోని హల్లిగట్టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరింది.
ఇది కూడా చదవండి: CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..
మూడు రోజుల క్రితం 19వ పుట్టినరోజును స్నేహితులతో కలిసి జరుపుకుంది. బర్త్డేకు హాజరుకాని వారికి బుధవారం మరోసారి స్వీట్లు కూడా పంచిపెట్టింది. తరగతులకు హాజరైన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి తన హాస్టల్ గదికి తిరిగి వచ్చింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆమె క్లాస్మేట్స్లో ఒకరు.. గది తలుపు లోపలి నుంచి లాక్ చేయబడి ఉండటాన్ని గమనించింది. పదే పదే తట్టినా, ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఈ విషయాన్ని హాస్టల్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లింది. బలవంతంగా తలుపు తెరిచి చూస్తే తేజస్విని విగతజీవిగా పడి ఉంది. సమీపంలోనే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్ట్ వర్కులు, తదుపరి చదవులు చదవడం ఇష్టం లేనట్లుగా నోట్లో పేర్కొంది.
పొన్నంపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే చనిపోయినట్లు సూసైడ్లో పేర్కొందని తెలిపారు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీటిపర్యంతం అయ్యారు.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..