Delhi Excise Policy: ఢిల్లీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఈడీ.. 4 రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Excise Policy: ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు రాష్ట్రాల్లోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. వీటిలో 20 స్థానాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నెల్లూరులో మద్యం వ్యాపారులు, పంపిణీదారులు, సరఫరా గొలుసు నెట్వర్క్లకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి వారాల వ్యవధిలో దాడుల చేయడం ఇది రెండోసారి. దర్యాప్తు సంస్థ గత వారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోని 45 చోట్ల ఈ కేసులో పేరున్న ప్రైవేట్ వ్యక్తులపై దాడులు చేయడంతో పాటు సోదాలు చేసింది.మనీలాండరింగ్ కేసులో మూడు నెలల క్రితం అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఢిల్లీలోని తీహార్ జైలులో మద్యం విక్రయాల విధానానికి సంబంధించి ప్రశ్నించాల్సిన రోజున ఈరోజు దాడులు జరిగాయి.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
Corona Cases: దేశంలో 46వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
తమ పార్టీ నేతలపై రాజకీయ ప్రతీకారం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలో మీడియాతో మాట్లాడనున్నారు. వివాదాస్పద మద్యం పాలసీలో ఎలాంటి అవకతవకలు లేవని ఆయన పేర్కొంటున్నారు. అధికార బీజేపీ తన మంత్రులను వేధింపులకు గురిచేస్తోందని, పార్టీకి ప్రజల నుంచి మద్దతును చూసి ఢిల్లీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తోందని ఆప్ పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు ఆర్థిక నేరాలను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ మద్యం పాలసీని విచారిస్తోంది.
ఈ కేసులో సీబీఐ ఆగస్టు 19న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఐఏఎస్ అధికారి, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ నివాసాలతో పాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్సైజ్, విద్యతో సహా పలు పోర్ట్ఫోలియోలను కలిగి ఉన్నారు.
తాజావార్తలు
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
-
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!