Delhi Excise Policy: ఢిల్లీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఈడీ.. 4 రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Excise Policy: ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు రాష్ట్రాల్లోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. వీటిలో 20 స్థానాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నెల్లూరులో మద్యం వ్యాపారులు, పంపిణీదారులు, సరఫరా గొలుసు నెట్వర్క్లకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి వారాల వ్యవధిలో దాడుల చేయడం ఇది రెండోసారి. దర్యాప్తు సంస్థ గత వారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలోని 45 చోట్ల ఈ కేసులో పేరున్న ప్రైవేట్ వ్యక్తులపై దాడులు చేయడంతో పాటు సోదాలు చేసింది.మనీలాండరింగ్ కేసులో మూడు నెలల క్రితం అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఢిల్లీలోని తీహార్ జైలులో మద్యం విక్రయాల విధానానికి సంబంధించి ప్రశ్నించాల్సిన రోజున ఈరోజు దాడులు జరిగాయి.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Corona Cases: దేశంలో 46వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
తమ పార్టీ నేతలపై రాజకీయ ప్రతీకారం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలో మీడియాతో మాట్లాడనున్నారు. వివాదాస్పద మద్యం పాలసీలో ఎలాంటి అవకతవకలు లేవని ఆయన పేర్కొంటున్నారు. అధికార బీజేపీ తన మంత్రులను వేధింపులకు గురిచేస్తోందని, పార్టీకి ప్రజల నుంచి మద్దతును చూసి ఢిల్లీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తోందని ఆప్ పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు ఆర్థిక నేరాలను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ మద్యం పాలసీని విచారిస్తోంది.
ఈ కేసులో సీబీఐ ఆగస్టు 19న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఐఏఎస్ అధికారి, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ నివాసాలతో పాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్సైజ్, విద్యతో సహా పలు పోర్ట్ఫోలియోలను కలిగి ఉన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..