Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. మూడు రోజుల్లో నాల్గోది..
- జమ్మూ కాశ్మీర్లో వరస ఎన్కౌంటర్లు..
- దోడాలో భద్రతా బలగాలు
- ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు..
- మూడు రోజుల్లో నాలుగోది..
- భద్రతా బలగాలు హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం దోడా జిల్లాలో మరో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. మూడు రోజుల వ్యవధిలో ఇది నాలుగోది కాగా, దోడా జిల్లాలో ఇది రెండో ఎన్కౌంటర్. జూన్ 9న రియాసీలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపడంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. దీని తర్వాత మంగళవారం కథువా జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో ఓ జవాన్ అమరుడవ్వగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఇదే రోజు దోడా జిల్లాలో చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
Read Also: Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..
Also Read
మంగళవారం అర్థరాత్రి భదర్వా-పఠాన్కోట్ రహదారిలోని చటర్గల్లా ఎగువ ప్రాంతంలోని జాయింట్ చెక్పోస్ట్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఐదుగురు సైనికులు మరియు ఒక ప్రత్యేక పోలీసు అధికారి (SPO) గాయపడ్డారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులతో కూడిన బృందం దోడాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నట్లు ఈ ఉదయం సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. దీంతో వారిని మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం సాయంత్రం ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
దోడా ప్రాంతలోని చటర్గల్లా, గుల్దండి, సర్థాల్, శంఖ్ పాడేర్ మరియు కైలాష్ పర్వత శ్రేణులలో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ప్రారంభమైంది. దీంతో భదర్వా-పఠాన్కోట్ అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ కదలికల్ని పూర్తిగా నిలిపేశారు. ఇదిలా ఉంటే రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్లో కలాల్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికల నేపథ్యంలో అధికారులు కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు. మరోవైపు పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?