Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. మూడు రోజుల్లో నాల్గోది..
- జమ్మూ కాశ్మీర్లో వరస ఎన్కౌంటర్లు..
- దోడాలో భద్రతా బలగాలు
- ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు..
- మూడు రోజుల్లో నాలుగోది..
- భద్రతా బలగాలు హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం దోడా జిల్లాలో మరో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. మూడు రోజుల వ్యవధిలో ఇది నాలుగోది కాగా, దోడా జిల్లాలో ఇది రెండో ఎన్కౌంటర్. జూన్ 9న రియాసీలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపడంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. దీని తర్వాత మంగళవారం కథువా జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో ఓ జవాన్ అమరుడవ్వగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఇదే రోజు దోడా జిల్లాలో చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
Read Also: Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
మంగళవారం అర్థరాత్రి భదర్వా-పఠాన్కోట్ రహదారిలోని చటర్గల్లా ఎగువ ప్రాంతంలోని జాయింట్ చెక్పోస్ట్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఐదుగురు సైనికులు మరియు ఒక ప్రత్యేక పోలీసు అధికారి (SPO) గాయపడ్డారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులతో కూడిన బృందం దోడాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నట్లు ఈ ఉదయం సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. దీంతో వారిని మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం సాయంత్రం ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
దోడా ప్రాంతలోని చటర్గల్లా, గుల్దండి, సర్థాల్, శంఖ్ పాడేర్ మరియు కైలాష్ పర్వత శ్రేణులలో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ ప్రారంభమైంది. దీంతో భదర్వా-పఠాన్కోట్ అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ కదలికల్ని పూర్తిగా నిలిపేశారు. ఇదిలా ఉంటే రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్లో కలాల్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికల నేపథ్యంలో అధికారులు కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు. మరోవైపు పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?