Emergency: ఎమర్జెన్సీ పొరపాటు, ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- ఎమర్జెన్సీ పొరపాటు.. ఇందిరాగాంధీ కూడా అంగీకరించారు..
- బీజేపీ ఎందుకు పాత విషయాల్లోకి వెళ్తోంది..?
- కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి. చిదంబరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency: 1975, జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే, జూన్ 25ని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. గత 10 ఏళ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ అనధికారికంగా ఎమర్జెన్సీని విధించిందని ఆరోపించాయి. పవిత్రమైన రాజ్యాంగానికి హత్య అనే పదాన్ని జోడించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పీ చిదంబరం ఎమర్జెన్సీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఏన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బిజెపి ఎందుకు 18 లేదా 17 వ శతాబ్దానికి తిరిగి వెళ్లడం లేదు? ఈ రోజు నివసిస్తున్న భారతీయులలో 75 శాతం మంది 1975 తర్వాత జన్మించారు. ఎమర్జెన్సీ పొరపాటు మరియు దానిని ఇందిరా గాంధీ అంగీకరించారు. ఎమర్జెన్సీని అంత సులువుగా విధించకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని సవరించాం.’’ అని అన్నారు. ఒక వేళ అటల్ బిహారీ వాజ్పేయి ఆ పరిస్థితుల్లో ఉంటే ఎమర్జెన్సీని విధించేవారని చెప్పారు. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ హక్కులు, తప్పులపై చర్చించడం ఏంటని, గతం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. బీజేపీ గతాన్ని మరిచిపోవాలని అన్నారు.
కేంద్రం ‘సంవిధాన్ హత్యా దివాస్’ ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు కావస్తున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ సమయంలో బాధల్ని అనుభవిస్తూ, రాజ్యాంగంపై దాడి చేసిన వారిని వ్యతిరేకించిన వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకు దీనిని ప్రకటించినట్లు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఇటీవల కాలంలో ఇండియా కూటమి నేతలు ‘రాజ్యాంగాన్ని రక్షించాలి’ అని నినాదాలు చేస్తుండటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతబూని ప్రమాణస్వీకారం చేయడంపై బీజేపీ కౌంటర్గా ఈ సంవిధాన్ హత్యా దివాస్ని ప్రకటించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!