NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
- నేడు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్
- టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సంయుక్తంగా ఈ పరీక్ష
- ప్రమాదాల సమయంలో ప్రజలకు వెంటనే సమాచారం అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నేడు (మే 2) లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీనిపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త మొబైల్ ఆధారిత విపత్తు హెచ్చరిక వ్యవస్థను పరీక్షించేందుకు ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సంయుక్తంగా ఈ పరీక్షను చేపడుతున్నాయి. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు లేదా ఇతర ప్రమాదాల సమయంలో ప్రజలకు వెంటనే సమాచారం అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.
ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థకు సాచెట్ (SACHET – National Disaster Alert Portal) అని పేరు పెట్టారు. ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు పలు మెట్రో నగరాల్లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థ పనితీరును మరోసారి పరీక్షించనున్నారు. NDMA పంపిన సందేశం ప్రకారం, మే 2, 2026న మీ ప్రాంతంలో ‘ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ పరీక్ష నిర్వహించబడుతుంది. మీ మొబైల్కు హెచ్చరిక సందేశం లేదా సైరన్ వచ్చినా ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం టెస్ట్ మాత్రమే.
Also Read
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
ఈ వ్యవస్థ ద్వారా
వినియోగదారుల మొబైల్ ఫోన్లకు SMS అలర్ట్ పంపిస్తారు
అదనంగా పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది
సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ ద్వారా ఒకేసారి వేలాది ఫోన్లకు అలర్ట్ చేరుతుంది
ప్రత్యేకంగా, విపత్తు సంభవించే ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు మాత్రమే హెచ్చరికలు చేరేలా ఈ వ్యవస్థ రూపొందించారు.
ఎందుకు ఈ పరీక్ష?
భవిష్యత్తులో వరదలు, భూకంపాలు, తుఫానులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే మే 2న మీ మొబైల్లో సైరన్ మోగినా, అలర్ట్ మెసేజ్ వచ్చినా భయపడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!