Electric Vehicles: ఎలక్ట్రిక్ బైక్ అగ్ని ప్రమాదాలకు ఈ లోపాలే కారణం.. నిపుణుల కమిటీ గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Vehicles Fire Accidents: రానున్న రోజుల్లో పెట్రోల్, డిజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజల్ని ఎలక్ట్రిక్ వాహనాల( ఈవీ )ల వైపు మళ్లించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం ఈవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి. దీంతో చాలా మంది ప్రజలు పెట్రోల్ బాధలు తప్పుతాయని.. ఎలక్ట్రిక్ బైకులను, కార్లను ప్రజలు కొనుగోలు చేశారు. కార్ల విషయంలో కంపెనీలు నాణ్యత ప్రమాణాలు పాటించి వినియోగదారులకు మెరుగైన ప్రొడక్ట్ అందించాయి. అయితే ఎలక్ట్రిక్ టూవీలర్లు మాత్రం అగ్ని ప్రమాదాలకు గురయ్యాయి. ఛార్జింగ్ పెడుతున్న సమయంలో, బైక్ నడుపుతున్న సమయాల్లో ఎలక్ట్రిక్ బైకులు అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రమాదాలపై నిపుణుల కమిటీని నియమించింది.
బ్యాటరీల నిర్వహణ వ్యవస్థ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఉపయోగించే సెల్స్ వెంటింగ్ మెకానిజంలో తీవ్రమైన లోపాలను గుర్తించింది ఎక్స్ పర్ట్ కమిటీ. ఈ ఏడాది ప్రారంభంలో ఈవీ బైకుల వరస ప్రమాదాలపై దర్యాప్తు చేయడానికి నిపుణుల కమిటీని నియమించింది. నాసిరకం వాహనాలను విక్రయించిన మూడు ఈవీ తయారీ కంపెనీలపై భారీ జరిమానా వేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగానే సదరు ఈవీ కంపెనీలకు భారీ జరిమాని విధించింది ప్రభుత్వం.
Also Read
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
Read Also: Russia will buy Rupees: మన కరెన్సీ రూపాయిని భారీగా కొననున్న రష్యా
తమిళనాడు వెల్లూర్ ఘటన తర్వాతా ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనే జరిగాయి. చాలా వరకు ఈవీలు షార్ట్ సర్క్యూట్, బ్యాటరీల్లో లోపాల వల్లే జరిగాయని నిపుణుల కమిటీ తేల్చింది. వరస అగ్ని ప్రమాదాల తరువాత.. ఈవీ కంపెనీలు నిర్లక్ష్యానికి పాల్పడితే భారీ జరిమానాలతో పాటు రీకాల్ చేస్తామని గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. ప్రభుత్వ ప్రయాణికుల భద్రతకు కట్టుబడి ఉందని ఈవీ కంపెనీలకు హెచ్చరించారు. బ్యాటరీ భద్రతా ప్రమాణాలను నిర్థారించడానికి రవాణా మంత్రిత్వ శాఖ త్వరలోనే నిబంధనలు జారీ చేస్తుందని తెలుస్తోంది. భద్రతా ప్రమాణాల ప్రకారం.. ఛార్జింగ్ చేసే సమయంలో ‘‘ ఆటో కటాఫ్’’ ఫీచర్ ను తీసుకురావాలని ఆదేశించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!