Uttar Pradesh: అన్నను చంపిన తమ్ముడు.. సహకరించిన తల్లి, చెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime news: రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం నశిస్తుంది. మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. పైసా మే పరమాత్మ అన్నట్లు బ్రతుకుతున్నారు చాలామంది. ఆస్తికోసం సొంత వాళ్లని కూడా చూడకుండా.. రక్తసంబంధీకులను కడతెరుస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడుని చంపిన అన్న, ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఇలా ఎన్నో వార్తలు వెలుగు చూసాయి. తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ జిల్లాలో అక్రమ్ అనే యువకుడు ఆస్తికోసం సొంత అన్ననే చంపాడు. అయితే చిన్న కొడుకు చేస్తుంది తప్పు అని చెప్పాల్సిన తల్లి, చెల్లి కూడా అతనికి సహకరించారు. అయితే షెహజాద్ ఆత్మహత్య చేసుకున్నాడని నిందితులే పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే మరణించిన వ్యక్తి భార్య పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చెప్పట్టారు పోలీసులు.
Read also:Israel–Hamas war: హమాస్ ఆర్థిక మంత్రిని చంపిన ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్..
Also Read
- Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు...ఇంతటి విలయానికి అదే కారణమా...?
- IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
- LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
దీనితో అసలు నిజాలు బయటకు వచ్చాయి. లోహియానా గర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆషియాన కాలనీలో షెహ్ జాద్ అనే వస్త్ర వ్యాపారి నివసిస్తున్నాడు. అయితే కొని రోజులుగా అతనికి తన తమ్ముడికి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన అన్నని మాట్లాడాలి అని ఓ గదిలోకి తీసుకెళ్లాడు అక్రమ్. వెంటనే రాడుతో అన్న చాతి పైన కొట్టాడు అనంతరం గొంతు నులిమి చంపేశారు. అయితే అక్రమ్ కు తల్లి, చెల్లి కూడా సహకరించారు. కాగా షెహజాద్ మృత దేహాన్ని ఫ్యాన్ కు ఉరివేసి ఆత్మహత్య గా చిత్రీకరించాలని ప్రయత్నించారు. వాళ్ళ వ్యూహం ఫలించలేదు. కాగా హత్య జరిగిన సమయంలో మృతుడి భార్య బిడ్డలు మేడపైన నిద్రిస్తున్నారు. భార్య బిడ్డల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు వారిస్తున్న వినకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా సోమవారం వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు
తాజావార్తలు
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
MOTOROLA Moto Book 60 Pro: మళ్లీరాని ఆఫర్.. మోటరోలా AI ల్యాప్టాప్.. సగం ధరకే.. OLED డిస్ప్లే
-
హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్పై హుమా ఫైర్
-
Motichoor Laddu Recipe: మార్కెట్ లడ్డూలు తిని విసిగిపోయారా?.. ఇంట్లోనే మెత్తని మోతీచూర్ లడ్డూ సులువుగా..
ట్రెండింగ్
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!