Kumal Kamra: కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
- కునాల్ కమ్రా వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
- న్యూటన్ సిద్ధాంతం ప్రకారమే జరిగిందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండే అభిమానులకు, శివసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని రప్పించింది. కునాల్ కమ్రా వ్యాఖ్యలతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు.
ఇది కూడా చదవండి: PK : షిహాన్ హుస్సైనీ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
Also Read
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
తాజాగా ఇదే అంశంపై షిండే తొలిసారి స్పందించారు. బీబీసీ మరాఠీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడారు. తనను ‘ద్రోహి’ అని సంభోదించాడంటే కచ్చితంగా ప్రత్యర్థుల దగ్గర సుపారీ తీసుకునే మాట్లాడినట్లుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమే.. కానీ ఒకరి ఆదేశం మేరకు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు. అయితే కార్యకర్తలు చేసిన విధ్వంసాన్ని సమర్థించనన్నారు. ఈ సందర్భంగా న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తుచేశారు. ‘‘చర్యకు.. ప్రతిచర్య’’ అనేది ఉంటుందని షిండే వ్యాఖ్యానించారు. ఇక ‘‘నా గురించి మరిపోండి.. కునాల్ అనే వ్యక్తి.. ప్రధానమంత్రి మోడీ గురించి.. మాజీ ప్రధాన న్యాయమూర్తి గురించి? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురించి? హోంమంత్రి అమిత్ షా గురించి.. పారిశ్రామిక వేత్తల గురించి ఏమన్నాడో తెలిసిందే కదా?.’’ అని పాత విషయాలను షిండే గుర్తుచేశారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది. వ్యంగ్యాన్ని కూడా అర్థం చేసుకుంటాం. కానీ దానికి ఒక పరిమితి ఉండాలి. ఎవరి గురించైనా వ్యతిరేకంగా మాట్లాడటానికి కాంట్రాక్ట్ తీసుకుని ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: స్ట్రాటజీ మారుస్తున్న వైఎస్ జగన్..! త్వరలోనే కీలక మార్పులు..!
ఒక హిందీ పాటను కునాల్ కమ్రా.. షిండే రాజకీయ జీవితాన్ని పేరడీ చేసి పాడారు. శివసేన పార్టీని చీల్చేసిన ‘ద్రోహి’ అంటూ షిండేను ఉద్దేశించి కునాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే పెద్ద దుమారం రేపాయి. షిండే మద్దతుదారులు.. క్లబ్, స్టూడియోపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేశారు. అనంతరం కునాల్పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇరుపక్షాలపై కేసులు నమోదు చేశారు. తాజాగా కునాల్కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. తమ ఎదుట హాజరుకావాలని కోరారు.
ఇదిలా ఉంటే కునాల్ను ముంబై పోలీసులు ఫోన్లో సంప్రదించగా.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ న్యాయస్థానాలు అడిగితే మాత్రం క్షమాపణ చెబుతాన్నారు. ఇక సుపారీ ఇచ్చి మాట్లాడించారంటూ వస్తున్న వార్తలను కునాల్ ఖండించారు.
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!