Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Eknath Shinde Eknath Shinde Challenge To His Rivals

Eknath Shinde: నా ఎమ్మెల్యే ఒక్కరు ఓడినా రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏక్‌నాథ్ షిండే సవాల్.

Published Date :July 16, 2022 , 6:19 pm
By Akkirala Kondala Rao
Eknath Shinde: నా ఎమ్మెల్యే ఒక్కరు ఓడినా రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏక్‌నాథ్ షిండే సవాల్.
  • Follow Us :
  • google news
  • dailyhunt

Eknath Shinde: తనను వ్యతిరేకించేవాళ్లకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సవాల్‌ విసిరారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన 50 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడినా రాజకీయాల నుంచి శాశ్వతంగా సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్‌ చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రేని వ్యతిరేకించి ఏక్‌నాథ్‌ షిండేకి మద్దతు తెలిపిన శాసన సభ్యులు ఆయన్ని ఈ రోజు ముంబైలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ ఈ 50 మంది ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్‌ చేయటం ద్వారా చాలా పెద్ద రిస్క్‌ తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.

‘నా వర్గం శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. అందుకే వాళ్లకు అన్నీ సమకూర్చుతా. నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తా. శివసేన గత చరిత్ర చూస్తే ఉద్ధవ్‌ ఠాక్రేని కాదని నా వైపు వచ్చిన ఎమ్మెల్యేలందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని కొందరు అంటున్నారు. వాళ్లు మొన్నటిదాకా మాతోపాటే సూరత్‌, గువాహటిల్లో ఉన్నోళ్లే. వాళ్లందరికీ నేనొక్కటే చెప్పదలచుకున్నా. నా ఎమ్మెల్యే ఒక్కరు ఓడినా నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అని తేల్చిచెప్పారు.

మొదట్లో తమకు తక్కువ మందే మద్దతిచ్చారని, తర్వాత ఆ సంఖ్య 50కి పెరిగిందని ఏక్‌నాథ్‌షిండే గుర్తుచేశారు. తమను వ్యతిరేకించేవాళ్లే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చివరికి తన ఇంటి మీద రాళ్లు వేయాలని కూడా పిలుపునిస్తున్నారని అన్నారు. అయితే వాళ్లకు స్పందన, మద్దతు కరువైందని, ఈ డర్టీ గేమ్‌లో పాలుపంచుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని, వాళ్లు తమతోనే ఉన్నారని ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు.

‘సూరత్‌, గువాహటిలో ఉన్నప్పుడు నేను చాలా భయపడేవాడిని. నిద్ర కూడా పట్టేది కాదు. రాత్రి ఒంటి గంట వరకు మెలకువతో ఉండేవాణ్ని. ఒంటి గంటకు పడుకున్నా మూడింటికే లేచేవాణ్ని. నా జీవితంలో ఇంత టెన్షన్‌ ఎప్పుడూ పడలేదు. నా భవిష్యత్తు గురించి నాకు ఆందోళన లేదు. నా వర్గం శాసన సభ్యుల భవిష్యత్‌ కోసమే నా తాపత్రయమంతా. ఎందుకంటే వాళ్లు నా నాయకత్వాన్ని బలపరిచారు. దీంతో నేను ముఖ్యమంత్రినయ్యా. నేను సీఎంని అయ్యానంటే నా వర్గం ఎమ్మెల్యేలు అందరూ సీఎంలు అయినట్లు సంతోష పడుతున్నారు’ అని ఏక్‌నాథ్‌ షిండే పేర్కొన్నారు.

మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు శివసేన ఎమ్మెల్యేలను చాలా ఘోరంగా చూసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులన్నీ కాంగ్రెస్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలకే ఇచ్చేవారని, తాను ముఖ్యమంత్రినయ్యాను కాబట్టి ఇక ఏ శాసనసభ్యుడికీ అలాంటి కష్టం రాబోందని, ఆ నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇచ్చారు. నిధులు మంజూరు చేయాలంటూ తాను ఒక్కసారి కాదు ఐదు సార్లు నాయకత్వాన్ని వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజల ప్రయోజనాల కోణంలో బాలా సాహెబ్‌ ఠాక్రే అమలుచేసిన హిందుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లటం కోసం ఉద్ధవ్‌ ఠాక్రేని పక్కన పెట్టాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏక్‌నాథ్‌ షిండే వివరించారు.

‘ప్రధాని నరేంద్ర మోడీ కూడా మా నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అయ్యాక అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని విన్నానని, ఎంతో బాగా నచ్చిందని ప్రధాని మోడీ నాతో చెప్పారు. నేను ఆ మాటలను నా గుండె లోతుల్లో నుంచి మాట్లాడాను’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Challenge
  • eknath shinde
  • emotional speech
  • feciliatation programme
  • maharastra cm

తాజావార్తలు

  • Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!

  • Chaitanyapuri Fraud Case: కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం.. చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా!

  • Onion Pickle Recipe: క్షణాల్లో ఉల్లిపాయ పచ్చడి రెడీ.. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ అడుగుతారు అంతే..!

  • Sensex Crash: ట్రంప్ ‘దిగ్బంధనం’ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 105 డాలర్లకు చేరిన ముడి చమురు!

  • Mangli:రూ.10 కోట్ల మోసం ఆరోపణలపై.. కన్నీళ్లు పెట్టుకుంటూ క్లారిటీ ఇచ్చిన మంగ్లీ..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions