Eknath Shinde: నా ఎమ్మెల్యే ఒక్కరు ఓడినా రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏక్నాథ్ షిండే సవాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: తనను వ్యతిరేకించేవాళ్లకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సవాల్ విసిరారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తన 50 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడినా రాజకీయాల నుంచి శాశ్వతంగా సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రేని వ్యతిరేకించి ఏక్నాథ్ షిండేకి మద్దతు తెలిపిన శాసన సభ్యులు ఆయన్ని ఈ రోజు ముంబైలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ఈ 50 మంది ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ చేయటం ద్వారా చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.
‘నా వర్గం శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. అందుకే వాళ్లకు అన్నీ సమకూర్చుతా. నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తా. శివసేన గత చరిత్ర చూస్తే ఉద్ధవ్ ఠాక్రేని కాదని నా వైపు వచ్చిన ఎమ్మెల్యేలందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని కొందరు అంటున్నారు. వాళ్లు మొన్నటిదాకా మాతోపాటే సూరత్, గువాహటిల్లో ఉన్నోళ్లే. వాళ్లందరికీ నేనొక్కటే చెప్పదలచుకున్నా. నా ఎమ్మెల్యే ఒక్కరు ఓడినా నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అని తేల్చిచెప్పారు.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
మొదట్లో తమకు తక్కువ మందే మద్దతిచ్చారని, తర్వాత ఆ సంఖ్య 50కి పెరిగిందని ఏక్నాథ్షిండే గుర్తుచేశారు. తమను వ్యతిరేకించేవాళ్లే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చివరికి తన ఇంటి మీద రాళ్లు వేయాలని కూడా పిలుపునిస్తున్నారని అన్నారు. అయితే వాళ్లకు స్పందన, మద్దతు కరువైందని, ఈ డర్టీ గేమ్లో పాలుపంచుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని, వాళ్లు తమతోనే ఉన్నారని ఏక్నాథ్ షిండే చెప్పారు.
‘సూరత్, గువాహటిలో ఉన్నప్పుడు నేను చాలా భయపడేవాడిని. నిద్ర కూడా పట్టేది కాదు. రాత్రి ఒంటి గంట వరకు మెలకువతో ఉండేవాణ్ని. ఒంటి గంటకు పడుకున్నా మూడింటికే లేచేవాణ్ని. నా జీవితంలో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. నా భవిష్యత్తు గురించి నాకు ఆందోళన లేదు. నా వర్గం శాసన సభ్యుల భవిష్యత్ కోసమే నా తాపత్రయమంతా. ఎందుకంటే వాళ్లు నా నాయకత్వాన్ని బలపరిచారు. దీంతో నేను ముఖ్యమంత్రినయ్యా. నేను సీఎంని అయ్యానంటే నా వర్గం ఎమ్మెల్యేలు అందరూ సీఎంలు అయినట్లు సంతోష పడుతున్నారు’ అని ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు.
మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు శివసేన ఎమ్మెల్యేలను చాలా ఘోరంగా చూసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులన్నీ కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలకే ఇచ్చేవారని, తాను ముఖ్యమంత్రినయ్యాను కాబట్టి ఇక ఏ శాసనసభ్యుడికీ అలాంటి కష్టం రాబోందని, ఆ నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇచ్చారు. నిధులు మంజూరు చేయాలంటూ తాను ఒక్కసారి కాదు ఐదు సార్లు నాయకత్వాన్ని వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజల ప్రయోజనాల కోణంలో బాలా సాహెబ్ ఠాక్రే అమలుచేసిన హిందుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లటం కోసం ఉద్ధవ్ ఠాక్రేని పక్కన పెట్టాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏక్నాథ్ షిండే వివరించారు.
‘ప్రధాని నరేంద్ర మోడీ కూడా మా నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అయ్యాక అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని విన్నానని, ఎంతో బాగా నచ్చిందని ప్రధాని మోడీ నాతో చెప్పారు. నేను ఆ మాటలను నా గుండె లోతుల్లో నుంచి మాట్లాడాను’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు.
తాజావార్తలు
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!