Eknath Shinde: సీఎంపై బీజేపీ నిర్ణయమే ఫైనల్.. బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తా..
- బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్లా..
- సీఎం పదవిపై బీజేపీ నిర్ణయమే ఫైనల్..
- ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ మద్దతు..
Eknath Shinde: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే, తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి కూటమి ఎవరిని సీఎంగా ఎన్నుకన్నా శివసైనికులు వారికి మద్దతు ఇస్తారని షిండే స్పష్టం చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.
‘‘నా వల్ల మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా సమస్య ఎదురైతే మీ మనసులో ఎలాంటి సందేహం రాకుడదని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయం ఆమోదయోగ్యమేనని ప్రధానికి చెప్పాను మీరు మా కుటుంబానికి అధిపతి, మీ నిర్ణయాన్ని మేము కూడా అంగీకరిస్తాము. ప్రభుత్వ ఏర్పాటులో ఏ సమస్య లేదు’’ అని షిండే చెప్పారు.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
‘‘నేను ఎల్లప్పుడు కార్యకర్తగానే పనిచేశాను, నేను ఎప్పుడూ సీఎం అవుతానని భావించలేదు. సీఎం అంటే కామన్ మ్యాన్. నేను దీనిని దృష్టిలో ఉంచుకుని పనిచేశాను. మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల బాధల్ని చూశాను.’’ అని షిండే అన్నారు. మహాయుతి కూటమి గెలుపుకోసం కార్యకర్తల పనిచేశానని అన్నారు. అతిపెద్ద విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ప్రజలకు ఆయన థాంక్స్ చెప్పారు. ప్రజలు మహావికాస్ అఘాడీని తిరస్కరించారని వెల్లడించారు.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని, సీఎం అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్లా అని షిండే చెప్పారు. మేము నిరాశ చెందలేదని, మేము నిరాశ చెందే వాళ్లం కామని, పోరాడే వాళ్లమని చెప్పారు. కలిసికట్టుగా మహాయుతి ఎన్నికల్లో పోరాడినట్లు చెప్పారు. తనకు ప్రధాని నరేంద్రమోడీ సంపూర్ణ మద్దతు ఉందన్నారు.
‘‘ గత 2-4 రోజులుగా మీరు ఎవరో దుమారం రేపుతున్నారనే పుకార్లు చూసి ఉంటారు. మేము విసుగు చెందే వ్యక్తులం కాదు. నేను ప్రధానితో మాట్లాడాను. మా వైపు నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం చేదు. మీ నిర్ణయమే ఫైనల్. బీజేపీ నిర్ణయం ఫైనల్. పీఎం మోడీ, అమిత్ షా తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాం. ’’ షిండే అన్నారు.
తాజావార్తలు
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!