Maharashtra New CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ.. నేడు కీలక భేటీ
- నేడు మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఎమ్మెల్యేల భేటీ..
- మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగనున్న చర్చ..
- నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra New CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందు కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ముఖ్యమంత్రి పోస్టుపై కన్నేసినట్టు చెప్పుకొస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు రేపటి (మంగళవారం)తో ముగియనుంది. కాబట్టి ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి అయింది.
Read Also: Huge Fire Accident: ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. పెద్దెత్తున మంటలు
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే ఛాన్స్ ఉంది. మూడు పార్టీల అగ్రనేతలు ఆదివారం తమ ఎమ్మెల్యేలతో చర్చించారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బావంకులే చెప్పుకొచ్చారు. ఇక, మరోవైపు.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్కు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే, మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింట్లో పైచేయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ కులానికి చెందినవారే ఉన్నారు. అయితే, ఈసారి కూడా తమ సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి పీఠం దక్కాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫడ్నవీస్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనను చాలా మంది గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకు ఉన్న ఇమేజీని వారు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30 శాతం ఉండగా.. బ్రాహ్మణులు కేవలం 10 శాతం ఉన్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!