Andhra Pradesh: అనకాపల్లిలో విషాదం.. ప్రాణం తీసిన అప్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెట్టింగ్.. బెట్టింగ్.. కొందరి జీవితాలను మారిస్తే.. మరికొన్ని జీవితాలు ఆదిలోనే అంతం చేస్తుంది..ఇలాంటివి చట్ట రీత్యా నేరం అయిన కొందరు బెట్టింగ్ రాయులు మాత్రం ఇలాంటివి చేస్తుంటారు.. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ ల వల్ల ఎందరో జీవితాలను కోల్పోయారు.. తాజాగా ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ వల్ల ప్రాణాన్ని కోల్పోయాడు.. బెట్టింగ్ కోసం చేసిన అప్పు వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. చేసిన అప్పు తీర్చలేక.. కుటుంబ పరువు పోతుందన్న మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు.. తనువు చాలించాడు. బెట్టింగ్ భూతానికి అనకాపల్లి జిల్లాలో యువకుడు బలయ్యాడు..
అతను చెల్లెలు పెళ్లి కోసం అప్పులు చేసిన యువకుడు.. ఆ అప్పుల నుంచి గట్టెక్కెందుకు బెట్టింగ్ వైపు మారాడు. బెట్టింగ్ల్లో తీవ్రంగా నష్టపోయి అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన 25 ఏళ్ల మణికంఠ సాయికుమార్కు ఇద్దరు చెల్లెలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో తోబుట్టునకు వివాహం చేసేందుకు అప్పులు చేశాడు. దాదాపు 3 లక్షల వరకు తీసుకొని పెళ్లి కోసం ఖర్చు చేశాడు. చేసినా అప్పుకు తెర్చే మార్గం లేక… బెట్టింగ్ పై ఆశలు పెట్టుకున్నాడు. బెట్టింగ్లో 40 వేల రూపాయలు కోల్పోయాడు..
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
అతను ఇంక అప్పు చేస్తే ఇక తీర్చలేను అనుకున్నాడు.. అదే విధంగా ఇప్పుడు చేసిన అప్పు కోసం బెట్టింగ్ రాయుళ్లు టార్చర్ పెట్టడంతో కుటుంబ పరువు పోతుందన్న .. మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు మణికంఠ. చేతికి అంది వచ్చినా కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు పుట్టెడు శోకంతో కన్నీరుమున్నీరవుతున్నారు.. కూలి పని చేసుకొని అయిన బ్రతికేస్తాము.. కానీ మమ్మల్ని వదిలి వెళ్లి పోతావా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. వారి రోదనను చూసిన వాళ్లంతా కంటతడి పెట్టేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.. బెట్టింగ్ లు వేస్తున్న వారిని పట్టుకొనే పనిలో ఉన్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!