Supreme Court: రూ.2,742 కోట్ల స్కామ్పై దాడులు.. మమతపై సుప్రీంకోర్టులో ఈడీ ఆరోపణలు
- మమతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఈడీ ఆరోపణలు
- రూ.2,742 కోట్ల స్కామ్పై దాడులు అడ్డుకున్నారు
- మమత, డీజీపీ, పోలీస్ కమిషనర్పై తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం కోల్కతాలో ఐ-ప్యాక్ కార్యాలయంపై ఈడీ ఊహించని రీతిలో దాడి చేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడుల వార్తలు వినగానే వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలికి చేరుకుని అడ్డుకున్నారు. కీలకమైన పత్రాలు, హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘అమిత్ షా దుర్మార్డుడు.. నీచుడు’’ అంటూ మండిపడ్డారు. తాను బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Stock Market: ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. లాభాల్లో సూచీలు
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి 8న ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయాల్లో జరిగిన ఈడీ దాడులు అడ్డుకున్నారని ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేశారని.. డిజిటల్ పరికరాలను బలవంతంగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. దాదాపు రూ.2,742 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోందని.. హవాలా ద్వారా రూ.20 కోట్లు ఐ-ప్యాక్ అందుకుందని ఆరోపించింది. మమతా బెనర్జీ 200 మంది పోలీసులతో ప్రతీక్ జైన్ నివాసానికి వచ్చి ఈడీ అధికారులను అడ్డుకున్నారని తెలిపింది. ల్యాప్ట్యాప్లు, మొబైల్ ఫోన్లు, పత్రాలను బలవంతంగా తీసుకెళ్లి 2 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారని ఈడీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, ఛాన్సలర్ మెర్జ్
అధికారులను బెదిరించడమే కాకుండా దర్యాప్తునకు పూర్తి ఆటంకం కలిగించారని చెప్పింది. ప్రస్తుతం ఈడీ అధికారులపై దాఖలైన ఎఫ్ఐఆర్పై స్టే విధించాలని కోరింది. ప్రతీకార చర్యలకు దిగితే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే డిజిటల్ పరికరాలను సీల్ చేయడం లేదా ఫోరెన్సిక్లో భద్రపరచాలని కోరింది.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?