Medical Emergence Drone: రక్తం రవాణాకు డ్రోన్.. రూపొందించిన ఇంజనీరింగ్ విద్యార్థి
Medical Emergence Drone: అత్యవసర వైద్య చికిత్సం అవసరం అయిన వారిని వెంటనే ఆసుపత్రికి చేర్చడానికి అంబులెన్స్ సర్వీస్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అత్యవసరంగా ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి గుండె ఆపరేషన్ కోసం గుండెను తీసుకెళ్లాలంటే ఆ రెండు ఆసుపత్రుల మధ్య ముందుగానే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసుల సహకారం తీసుకొని నిమిషాల వ్యవధిలో గుండెను ఆసుపత్రికి చేర్చడానికి చర్యలు తీసుకుంటారు. అలానే ఇకపై రక్తం మార్పిడి కోసం అవసరమైన రక్తం(బ్లడ్)ను ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి చేర్చడానికి ప్రత్యేకంగా డ్రోన్ను ఉపయోగించనున్నారు. అలాంటి డ్రోన్ను జమ్ము కాశ్మీర్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి రూపొందించాడు. దానిని ఇప్పటికే ప్రయోగత్మకంగా ఉపయోగించినట్టు ఇంజనీరింగ్ విద్యార్థి తెలిపాడు. అందుకు సంబంధించిన వివరాలు..
Read also: Beauty Salons: బ్యూటీ పార్లర్లపై నిషేధం.. వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన ఆఫ్ఘన్ మహిళలు
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
కశ్మీర్కు చెందిన అబాన్ హబీబ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఒక ఆసుపత్రి నుండి మరొక ఆసుపత్రికి వైద్య అత్యవసర పరిస్థితుల కోసం రక్తాన్ని రవాణా చేయగల అసాధారణ డ్రోన్ ను అతను అభివృద్ధి చేశాడు. విపత్తు సమయాల్లో మెడికల్ ఎమర్జెన్సీ కోసం డ్రోన్ అభివృద్ది చేసినట్టు అబాన్ హబీబ్ తెలిపాడు. శ్రీనగర్ లోని జకురా ప్రాంతానికి చెందిన అబాన్ హబీబ్ ఏళ్ల తరబడి శ్రమించి, లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడే సామర్థ్యం, మారుమూల ప్రాంతాల్లో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే సామర్థ్యం ఉన్న ఎగిరే యంత్రాన్ని (మెడికల్ ఎమర్జెన్సీ డ్రోన్) రూపొందించాడు. శ్రీనగర్ నగరాన్ని 2014 వరదల్లో ముంచెత్తిన సందర్భంగా సంభవించిన విధ్వంసం, మానవ బాధలను చూసిన తర్వాత తన ఆవిష్కరణకు స్ఫూర్తి పొందానని అబాన్ చెప్పారు. 2014లో సంభవించిన వినాశకరమైన వరదలను చూసిన తరువాత, రక్త నమూనాలు, పౌచ్లను ఆసుపత్రుల మధ్య బదిలీ చేయడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనాలనుకున్నానని అబాన్ చెప్పారు. ఈ క్రమంలో ఐదేళ్ల పాటు డ్రోన్ టెక్నాలజీపై కష్టపడ్డాడు. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలు విజయవంతమయ్యాయి. డ్రోన్ 20 నుంచి 25 ఆసుపత్రులను కేంద్ర ఆసుపత్రికి అనుసంధానించింది.. 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
Read also
తన చిన్నప్పటి నుంచి కశ్మీర్ లో అనేక ప్రకృతి వైపరీత్యాలను చూశాననీ, అలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో 2014లో కాశ్మీర్ లో వరదలు వచ్చాయని చెప్పారు. ప్రజలకు సహాయక సామగ్రి అవసరమనీ, మౌలిక సదుపాయాల లేమితో ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఘోరంగా విఫలమైందో చూశామన్నారు. అవి చాలా కలవరపరిచే దృశ్యాలు, హెలికాప్టర్ల నుండి సహాయాన్ని తగ్గించే ఈ ప్రయత్నం సరిపోదని అందరికీ తెలుసు. అప్పుడే తాను డ్రోన్ల గురించి ఆలోచించాననీ, అటువంటి పరిస్థితులలో అవి ఎంత సహాయపడతాయని తెలిపాడు. స్వయంప్రతిపత్తి కలిగిన, కృత్రిమ మేధతో కూడిన చిన్న డ్రోన్లను తయారు చేసి విపత్తు ప్రాంతాలకు సహాయక సామాగ్రిని చేరవేస్తే, అవి ఎక్కువ ఖర్చు లేకుండా సహాయాన్ని అందించగలవని పేర్కొన్నాడు. జేకేఈడీఐ, జేకేటీపీవో తనను ప్రోత్సహించాయనీ, అయితే ప్రభుత్వం నుంచి తనకు ఇంకా ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని అబాన్ హబీబ్ తెలిపారు. డీఆర్డీవో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అబాన్ హబీబ్ గుజరాత్ కు వెళ్లి అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ మకుంద్ మేజర్ నరవణేకు తన డ్రోన్ ను చూపించగా, తన నా ప్రయత్నాన్ని ఆయన మెచ్చుకున్నారని తెలిపాడు. హిమాచల్ ప్రదేశ్ లో 25 చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నామనీ, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాశ్మీర్ లోనూ అదే నమూనాను అమలు చేయాలనుకుంటున్నామని అబాన్ తండ్రి హెచ్ యూ మాలిక్ తెలిపారు. అబాన్ కూడా స్కిమ్స్ ఆస్పత్రిని అనుసంధానం చేసే పనిలో ఉన్నాడు. జీఎంసీ బారాముల్లాతో ఎస్ఎంహెచ్ఎస్, దాని కోసం ఫ్లై మిషన్ ను ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. కాశ్మీర్ లో ఈ ప్రాజెక్టు పనిచేయడం తన కుమారుడి కల అని మాలిక్ చెప్పారు. స్కిమ్స్ ఆసుపత్రిని లోయలోని ఇతర తృతీయ, జిల్లా ఆసుపత్రులతో అనుసంధానించాలనుకుంటున్నామనీ, తమకు సహకరించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఈ విషయంలో అన్ని ఎస్ఓపీలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో