Joe Biden: బైడెన్ “ప్రోటోకాల్ ఉల్లంఘన”.. కార్ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: భారత్ జీ20 సమావేశాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. విదేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా కీలక వ్యక్తులు ఢిల్లీకి వచ్చారు. ముఖ్యంగా అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు భారీ సెక్యూరిటీ ఇస్తున్నారు. సీఐఏతో పాటు భారతదేశ సెక్యూరిటీ విభాగం అడుగడుగున ప్రెసిడెంట్ భద్రతను పర్యవేక్షిస్తోంది. ఇంత సెక్యూరిటీ ఉండే బైడెన్ కాన్వాయ్ లో ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రోటోకాల్ని ఉల్లంఘించారు. ఈ ఘటన శనివారం ఢిల్లీలో జరిగింది.
Read Also: Bihar: మహ్మద్ ప్రవక్తపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..మండిపడుతున్న ప్రతిపక్షం
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
వెంటనే అక్కడి అధికారులు సదరు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత విచారించి అతన్ని విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బస చేస్తున్న తాజ్ హోటల్ లోకి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ లోని ఒక కారు ప్రవేశించింది. దీంతో కారు డ్రైవర్నిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత.. బైడెన్ బస చేస్తున్న ఐటీసీ మౌర్య వద్దకు ఉదయం 9.30 గంటలకు రావాల్సి ఉందని కారు డ్రైవర్ చెప్పాడు. అయితే అతను లోధి ఎస్టేట్ ప్రాంతం నుంచి ఓ వ్యాపారవేత్తను తాజ్ వద్ద డ్రాప్ చేయాల్సి రావడంతో తాజ్ వద్దకు వచ్చినట్లు చెప్పాడు. ప్రోటోకాల్ గురించి తనకు తెలియదని కార్ డ్రైవర్ చెప్పారు. కాన్వాయ్ నుంచి కార్ని తీసుకువచ్చిన తర్వాత భద్రతా అధికారులు అతనిని ప్రశ్నించి విడుదల చేశారు.
ఇదిలా ఉంటే బైడెన్ జీ20 సమావేశాల అనంతరం వియత్నాం బయలుదేరాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల కోసం బైడెన్ శుక్రవారం భారత్ చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శనివారం ఇతర దేశాధినేతలతో కలిసి జీ20 సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని మహాత్మాగాంధీ స్మారక రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన వియత్నాం బయలుదేరారు.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!