Joe Biden: బైడెన్ “ప్రోటోకాల్ ఉల్లంఘన”.. కార్ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ..
Joe Biden: భారత్ జీ20 సమావేశాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. విదేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా కీలక వ్యక్తులు ఢిల్లీకి వచ్చారు. ముఖ్యంగా అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు భారీ సెక్యూరిటీ ఇస్తున్నారు. సీఐఏతో పాటు భారతదేశ సెక్యూరిటీ విభాగం అడుగడుగున ప్రెసిడెంట్ భద్రతను పర్యవేక్షిస్తోంది. ఇంత సెక్యూరిటీ ఉండే బైడెన్ కాన్వాయ్ లో ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రోటోకాల్ని ఉల్లంఘించారు. ఈ ఘటన శనివారం ఢిల్లీలో జరిగింది.
Read Also: Bihar: మహ్మద్ ప్రవక్తపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..మండిపడుతున్న ప్రతిపక్షం
Also Read
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
వెంటనే అక్కడి అధికారులు సదరు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత విచారించి అతన్ని విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బస చేస్తున్న తాజ్ హోటల్ లోకి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ లోని ఒక కారు ప్రవేశించింది. దీంతో కారు డ్రైవర్నిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత.. బైడెన్ బస చేస్తున్న ఐటీసీ మౌర్య వద్దకు ఉదయం 9.30 గంటలకు రావాల్సి ఉందని కారు డ్రైవర్ చెప్పాడు. అయితే అతను లోధి ఎస్టేట్ ప్రాంతం నుంచి ఓ వ్యాపారవేత్తను తాజ్ వద్ద డ్రాప్ చేయాల్సి రావడంతో తాజ్ వద్దకు వచ్చినట్లు చెప్పాడు. ప్రోటోకాల్ గురించి తనకు తెలియదని కార్ డ్రైవర్ చెప్పారు. కాన్వాయ్ నుంచి కార్ని తీసుకువచ్చిన తర్వాత భద్రతా అధికారులు అతనిని ప్రశ్నించి విడుదల చేశారు.
ఇదిలా ఉంటే బైడెన్ జీ20 సమావేశాల అనంతరం వియత్నాం బయలుదేరాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల కోసం బైడెన్ శుక్రవారం భారత్ చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శనివారం ఇతర దేశాధినేతలతో కలిసి జీ20 సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని మహాత్మాగాంధీ స్మారక రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన వియత్నాం బయలుదేరారు.
తాజావార్తలు
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!