Bihar: మహ్మద్ ప్రవక్తపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..మండిపడుతున్న ప్రతిపక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Education Minister Chandrashekar Comments On Prophet Muhammad: మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాబా అభయనాథ్ ధామ్ ఆవరణలోని నలందాహిల్సా సబ్ డివిజన్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మహమ్మద్ ప్రవక్తను మర్యాద పురుషోత్తముడు అని అభివర్ణించారు. ఎప్పుడైతే సెంట్రల్ ఏషియాలో నిజాయితీ అంతరించి పోయి, దుర్మార్గులు,చెడు పెరిగాయో అప్పుడు దైవం మీద నమ్మకం కలిగించడానికి దేవుడు మర్యాద పురుషోత్తముడు మహ్మద్ ప్రవక్తను భూమి మీదకు పంపించాడని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే బిహార్ లో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం కేవలం రాముడిని మాత్రమే పురుషోత్తముడు అని సంబోధిస్తారు.
Also Read: G-20 Summit: రెండోరోజు G20 సమావేశాలు.. వాటిపైనే చర్చలు
Also Read
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ స్పందించారు. జన్మాష్టమి కార్యక్రమంలోనే భగవాన్ శ్రీకృష్ణుడి పవిత్రతను కించపరిచే ప్రయత్నం మంత్రి చేశారని బీజేపీ నేత ఆరోపించారు. ప్రతిపక్ష కూటమి ఇండియా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడుతుందని మండిపడ్డ ఆయన ఇస్లాం అనుకూల, పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలతో ఓట్లు పొందాలని చూస్తుందన్నారు. మంత్రి సున్తీ చేయించుకొని, పాకిస్తాన్ వెళ్లిపోవాలని నిఖిల్ అన్నారు. చంద్రశేఖర్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అందుకే ఒకసారి రామాయణంపై మరోసారి మహ్మద్ ప్రవక్తపై కామెంట్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. ఆయన సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూని నివారించినట్లే నివారించాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడటమే కాకుండా ఉదయనిధిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రతిపక్ష కూటమి ఇండియా కూడా చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
-
Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Sankranti Release: Sankranti Release: సంక్రాంతిపై కన్నేసిన దిల్ రాజు.. దాదాపు 150 రోజుల పాటు కొత్త సినిమా షూటింగ్!
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..