Bihar: మహ్మద్ ప్రవక్తపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..మండిపడుతున్న ప్రతిపక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Education Minister Chandrashekar Comments On Prophet Muhammad: మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాబా అభయనాథ్ ధామ్ ఆవరణలోని నలందాహిల్సా సబ్ డివిజన్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మహమ్మద్ ప్రవక్తను మర్యాద పురుషోత్తముడు అని అభివర్ణించారు. ఎప్పుడైతే సెంట్రల్ ఏషియాలో నిజాయితీ అంతరించి పోయి, దుర్మార్గులు,చెడు పెరిగాయో అప్పుడు దైవం మీద నమ్మకం కలిగించడానికి దేవుడు మర్యాద పురుషోత్తముడు మహ్మద్ ప్రవక్తను భూమి మీదకు పంపించాడని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే బిహార్ లో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం కేవలం రాముడిని మాత్రమే పురుషోత్తముడు అని సంబోధిస్తారు.
Also Read: G-20 Summit: రెండోరోజు G20 సమావేశాలు.. వాటిపైనే చర్చలు
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ స్పందించారు. జన్మాష్టమి కార్యక్రమంలోనే భగవాన్ శ్రీకృష్ణుడి పవిత్రతను కించపరిచే ప్రయత్నం మంత్రి చేశారని బీజేపీ నేత ఆరోపించారు. ప్రతిపక్ష కూటమి ఇండియా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడుతుందని మండిపడ్డ ఆయన ఇస్లాం అనుకూల, పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలతో ఓట్లు పొందాలని చూస్తుందన్నారు. మంత్రి సున్తీ చేయించుకొని, పాకిస్తాన్ వెళ్లిపోవాలని నిఖిల్ అన్నారు. చంద్రశేఖర్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అందుకే ఒకసారి రామాయణంపై మరోసారి మహ్మద్ ప్రవక్తపై కామెంట్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. ఆయన సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూని నివారించినట్లే నివారించాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడటమే కాకుండా ఉదయనిధిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రతిపక్ష కూటమి ఇండియా కూడా చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?