Mallikarjun kharge: దేవుడిపై నమ్మకం ఉంటే ఇంట్లో చేసుకోంది.. మోడీ ‘‘ధ్యానం’’పై ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun kharge: కన్యాకుమారిలో ప్రధాని నరేంద్రమోడీ ‘‘ధ్యానం’’పై కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రధానిపై విమర్శలు చేశారు. రాజకీయాలను, మతాన్ని ఎప్పటికీ కలపకూడదని, దేవుడిపై విశ్వాసం ఉంటే ఇంట్లోనే ధ్యానం చేసుకోండి అంటూ మండిపడ్డారు. ‘‘రాజకీయాలను మతాన్ని ఎప్పుడు కలిపి చూడకూడదని, ఒక మతానికి చెందిన వ్యక్తి మీతో ఉండొచ్చు. మరొక మతానికి చెందిన వ్యక్తి మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఎన్నికల్లో మతపరమైన భావాలను ముడిపెట్టడం సరికాదు’’ అని ఖర్గే అన్నారు.
Read Also: Loksabha Elections 2024: రేపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ సమయంలోనే..
Also Read
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో విడతకు జూన్ 1న ఎన్నికలకు జరగనున్నాయి. అయితే, దీనికి 3 రోజుల ముందు ప్రధాని ఆధ్యాత్మిక విహారం కోసం కన్యాకుమారి చేరుకున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలో ప్రధాని నరేంద్రమోడీ 48 గంటల పాటు జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానాన్ని కొనసాగించనున్నారు. అయితే, అతను కన్యాకుమారి వెళ్లి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని ఖర్గే అన్నారు. ఇంత మంది పోలీసులను నియమించడం ద్వారా డబ్బుని వృథా చేస్తున్నారని, ఈ చర్య దేశానికి హాని కలిగిస్తుందని అన్నారు. మీకు దేవుడిపై నమ్మకం ఉంటే ఇంట్లో ధ్యానం చేసుకోవాలని సూచించారు.
శనివారం చివరిదైన ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పోటీ చేస్తున్న వారణాసితో పాటు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
-
Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
-
Devara : ట్రోల్స్పై మౌనం వీడిన ‘దేవర’ డీఓపీ… హీరోల హైట్ పై షాకింగ్ కామెంట్స్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!