Thalapathy Vijay: దళపతి విజయ్కి డీఎంకే పార్టీ భయపడుతోంది.. ఏఐడీఎంకే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన కొత్త మూవీ లియోపై తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. దీనిపై అధికార డీఎంకేపై ఏఐడీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో ఏఐడీఎంకే ప్రభుత్వంలో సమాచార, ప్రచార మంత్రిగా పనిచేసిన కదంబూర్ రాజు డీఎంకేని విమర్శించారు. లియో షో టైమింగ్స్ పై ఆంక్షలు విధించినందుకు డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లియో మూవీ ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాకు 5 షోలకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఉదయం 9 గంటల నుంచి అర్థరాత్రి 1.30 గంటలకు మాత్రమే షోలకు అనుమతి ఇచ్చింది.
Read Also: Nikki Haley: గాజా పౌరులను ఎందుకు మీ దేశాల్లోకి అనుమతించడం లేదు.. ఇస్లామిక్ దేశాలపై మండిపాటు..
Also Read
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ఈ నేపథ్యంలో ఇది పొలిటికల్ వివాదానికి దారి తీసింది. దళపతి విజయ్ని చూసి డీఎంకే భయపడుతోందని, అందుకనే లియో మూవీపై ఆంక్షలు విధిస్తోందని కదంబూర్ రాజు విమర్శించారు. విజయ్, అజిత్ వంటి టాప్ స్టార్లకు స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, దీపావళి, పొంగల్ సమయంలో అగ్రతారల కోసం ప్రత్యేక షోలకు అనుమతించాలని, మా పాలనలో ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.
2006-2011 మధ్య కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే జరిగిందని రాజు గుర్తు చేశారు. తమిళ సినిమాల విడుదలపై ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తోందని కూడా కదంబూర్ రాజు ఆరోపించారు. అన్నాడీఎంకే అధినేత ‘లియో’ ఆడియో లాంచ్ రద్దు చేయడంలో కూడా డీఎంకే పాత్ర ఉందన్నారు. అయితే చెన్నైలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈవెంట్ కి జరిగిన విధంగా సమస్యలు తలెత్తుతాయనే కారణంగానే లియో ఆడియో లాంచ్ ను రద్దు చేయాల్సి వచ్చిందని డీఎంకే వర్గాలు తెలిపాయి. సామర్థ్యానికి మించి జనాలు హాజరైతే సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతోనే ఇలా చేశామని డీఎంకే తెలుపుతోంది.
తాజావార్తలు
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!